సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మన ఇంట్లో ఉన్న పూజగదిలో పూజలు చేస్తుంటాము. ఈ విధంగా ప్రతి రోజూ పూజలు చేస్తే మన జీవితంలో ఏర్పడిన కష్టాలను ఆ దైవం తొలగించి మనకు అష్టైశ్వర్యాలను కలిగించాలని ప్రార్థిస్తాము. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పూజలో కొన్ని వస్తువులను ఉపయోగించడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు వాతావరణం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే మన పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
మన ఇంట్లో పూజ గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువులలో శంఖం ఒకటి. పురాణాల ప్రకారం శంఖం లక్ష్మీదేవితో పాటు సముద్రం నుంచి పుట్టింది. కనుక శంఖాన్ని కూడా లక్ష్మీదేవి గానే భావించి పూజలు చేస్తారు. ఈ విధంగా పూజ గదిలో శంఖం ఉండటం శుభపరిణామం. పూజ అనంతరం శంఖం ఊదటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి.
పూజ సమయంలో పూజ గదిలో గంట తప్పనిసరి. పూజ చేస్తున్న సమయంలో గంట కొట్టడం వల్ల మన ఏకాగ్రత మొత్తం స్వామి వారిపై, పూజపై ఉంటుంది. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఆవహించి ఉన్న దృష్టశక్తులు తొలగిపోతాయి. నెమలి ఫించాన్ని పూజ గదిలో ఉంచడం ఎంతో శుభసూచకం. నెమలి ఈకలను పూజగదిలో ఉంచటం వల్ల మన సంపద పెరుగుతుంది.
అదేవిధంగా మన పూజ గదిలో ఉండాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు కలశం. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక రాగి చెంబులో నీటిని నింపి పూజగదిలో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని చెట్లకు పోయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…