Theertham And Prasadam In Temple : ఆలయానికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు మన బాధలన్నీ కూడా మనం మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉంటాం. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని ఆ తర్వాత బయటికి రావాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఒక్క నియమాన్ని మాత్రమే కాకుండా ప్రసాదం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని కూడా చూసి తెలుసుకుని పాటించండి.
ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు. అలానే ప్రసాదం కూడా పెడతారు. శివుడి ఆలయానికి వెళ్ళినప్పుడు బిల్వతీర్థం ఇస్తారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసీదళం తీర్థం ఇస్తారు. అయితే తీర్థం కానీ ప్రసాదం కానీ ఇస్తే కొంత మంది వారి చేతులతో తీసుకుంటారు. కొంతమంది ఎవరైనా తీసుకుంటే వాళ్ళ చేతిలో నుండి మార్చుకుంటారు. అయితే ఎప్పుడూ కూడా గుడిలో ఇచ్చే తీర్థం విషయంలో కానీ ప్రసాదం విషయంలో కానీ తప్పులను చేయకూడదు.
గుడిలో చక్కెర పొంగలి, పులిహోర వంటివి ఇచ్చినప్పుడు కూడా కొన్ని పొరపాట్లని చేస్తుంటారు కొందరు. తీర్థం తీసుకోవాలి అంటే ఎడమ చేతి మీద, కుడి చేతిని పెట్టి తీర్థం తీసుకుని తర్వాత రెండు కళ్ళకి అద్దుకుని తర్వాత తీర్థాన్ని తాగాలి. చాలామంది తీర్థం తాగిన తర్వాత తలకి చేతులు రాసుకుంటారు. ఆ తప్పు అసలు చేయకూడదు. రెండు చేతుల్ని తుడుచుకోవాలి. స్త్రీలు తీర్థం, ప్రసాదం గుడిలో తీసుకునేటప్పుడు పైటకొంగుని చేతులతో పట్టుకుని పువ్వులు వంటివి ఇచ్చినప్పుడు పైటకొంగుతో అందుకోవాలి.
చక్కెర పొంగలి లాంటివి ఇస్తే కుడి చేత్తో తీసుకోవాలి. కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకున్నాక ఎడమ చేతిలోకి మార్చుకుని కొంచెం కొంచెం కుడి చేత్తో తినాలి. కానీ చాలామంది కుడి చేతిలోకి ప్రసాదం మొత్తం తీసుకుని, పక్షులు తిన్నట్టు తింటారు. అది తప్పు. అలా చేస్తే మళ్లీ జన్మలో పక్షై పుడతారని అంటారు. చూశారు కదా ప్రసాదం తినేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదనేది. ఇటువంటి తప్పులని ప్రసాదం తినేటప్పుడు అసలు చేయకండి మరి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…