Theertham And Prasadam In Temple : ఆలయానికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు మన బాధలన్నీ కూడా మనం మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉంటాం. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని ఆ తర్వాత బయటికి రావాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఒక్క నియమాన్ని మాత్రమే కాకుండా ప్రసాదం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని కూడా చూసి తెలుసుకుని పాటించండి.
ఆలయానికి వెళ్ళినప్పుడు తీర్థం ఇస్తారు. అలానే ప్రసాదం కూడా పెడతారు. శివుడి ఆలయానికి వెళ్ళినప్పుడు బిల్వతీర్థం ఇస్తారు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసీదళం తీర్థం ఇస్తారు. అయితే తీర్థం కానీ ప్రసాదం కానీ ఇస్తే కొంత మంది వారి చేతులతో తీసుకుంటారు. కొంతమంది ఎవరైనా తీసుకుంటే వాళ్ళ చేతిలో నుండి మార్చుకుంటారు. అయితే ఎప్పుడూ కూడా గుడిలో ఇచ్చే తీర్థం విషయంలో కానీ ప్రసాదం విషయంలో కానీ తప్పులను చేయకూడదు.
గుడిలో చక్కెర పొంగలి, పులిహోర వంటివి ఇచ్చినప్పుడు కూడా కొన్ని పొరపాట్లని చేస్తుంటారు కొందరు. తీర్థం తీసుకోవాలి అంటే ఎడమ చేతి మీద, కుడి చేతిని పెట్టి తీర్థం తీసుకుని తర్వాత రెండు కళ్ళకి అద్దుకుని తర్వాత తీర్థాన్ని తాగాలి. చాలామంది తీర్థం తాగిన తర్వాత తలకి చేతులు రాసుకుంటారు. ఆ తప్పు అసలు చేయకూడదు. రెండు చేతుల్ని తుడుచుకోవాలి. స్త్రీలు తీర్థం, ప్రసాదం గుడిలో తీసుకునేటప్పుడు పైటకొంగుని చేతులతో పట్టుకుని పువ్వులు వంటివి ఇచ్చినప్పుడు పైటకొంగుతో అందుకోవాలి.
చక్కెర పొంగలి లాంటివి ఇస్తే కుడి చేత్తో తీసుకోవాలి. కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకున్నాక ఎడమ చేతిలోకి మార్చుకుని కొంచెం కొంచెం కుడి చేత్తో తినాలి. కానీ చాలామంది కుడి చేతిలోకి ప్రసాదం మొత్తం తీసుకుని, పక్షులు తిన్నట్టు తింటారు. అది తప్పు. అలా చేస్తే మళ్లీ జన్మలో పక్షై పుడతారని అంటారు. చూశారు కదా ప్రసాదం తినేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదనేది. ఇటువంటి తప్పులని ప్రసాదం తినేటప్పుడు అసలు చేయకండి మరి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…