ఆధ్యాత్మికం

Stambheshwarnath Temple : ప‌గ‌లంతా తేలి ఉంటుంది.. రాత్ర‌యితే ఈ ఆల‌యం స‌ముద్రంలో మునిగిపోతుంది తెలుసా..?

Stambheshwarnath Temple : మ‌న దేశంలో ఉన్న ఎన్నో చారిత్రాత్మ‌క ఆల‌యాల‌కు ఒక్కో విశేషం ఉంటుంది. ప్ర‌తి ఆల‌యానికి స్థ‌ల పురాణం, ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంటాయి. కానీ చాలా వ‌ర‌కు అలాంటి విశిష్ట‌త‌లు ఉన్న ఆల‌యాల గురించి మ‌న‌కు తెలియ‌దు. ఇప్పుడు చెప్ప‌బోయే ఆల‌యం కూడా అదే కోవ‌కు చెందుతుంది. దానికి ఉన్న విశిష్ట‌త‌ల‌ను తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. మ‌రింకెందుకాల‌స్యం.. ఆ ఆల‌యం ఏమిటో.. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు స‌మీపంలో భావ్ న‌గ‌ర్ అనే ప్రాంతం ఉంది. అక్క‌డికి ద‌గ్గ‌ర‌లో ఉన్న క‌వికాంబోయి అనే గ్రామానికి స‌మీపంలో అరేబియా మ‌హా స‌ముద్రం ఉంటుంది. ఆ స‌ముద్రంలోనే స్తంభేశ్వ‌ర‌నాథ ఆల‌యం ఉంటుంది. దీనికి చాలా విశిష్ట‌త‌లు ఉన్నాయి. ఈ ఆల‌యానికి ఎప్పుడు ప‌డితే అప్పుడు వెళ్లలేం.

మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.30 గంట‌ల లోపు మాత్ర‌మే ఆల‌యంలో స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తినిస్తారు. ఎందుకంటే మిగిలిన స‌మ‌యంలో ఈ ఆల‌యం స‌ముద్రంలో మునిగిపోయి ఉంటుంది. అవును, నిజ‌మే. అందుకే ఈ ఆల‌యానికి స్తంభేశ్వ‌ర‌నాథ ఆల‌యం అని పేరు వ‌చ్చింది. ఇక ఆల‌యం మునిగి ఉన్న‌ప్పుడు కేవ‌లం శిఖ‌రం, ధ్వ‌జ స్తంభాలు మాత్ర‌మే భ‌క్తుల‌కు క‌నిపిస్తాయి.

Stambheshwarnath Temple

అయితే పైన చెప్పిన‌ట్లుగా దైవ ద‌ర్శానికి రోజూ మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.30 గంట‌లు అని ఏమీ ఉండ‌దు. ఆ స‌మ‌యం ఒక్కోసారి మారుతుంది. కొన్ని సార్లు ఉద‌యమే ఆల‌యం పైకి వ‌చ్చి ఉంటుంది. మ‌ధ్యాహ్నం మునిగి ఉంటుంది. క‌నుక ఆ స‌మయాల్లో మాత్రం భ‌క్తుల‌కు ముందుగా చిట్టీల ద్వారా ఆల‌యం మునిగే స‌మ‌యాన్ని తెలియ‌ప‌రుస్తారు. దీంతో ఆల‌యం ద‌గ్గ‌ర‌కు వెళ్లే భ‌క్తులు ఆ స‌మ‌యం చూసుకుని.. దైవ ద‌ర్శ‌నం, పూజ‌లు చేసుకుని.. ఆ స‌మ‌యం క‌న్నా ముందుగానే తిరిగి రావాల్సి ఉంటుంది. ఇక ఆల‌యం వ‌ద్ద‌కు వెళ్లేందుకు తీరం నుంచి తాడును ఏర్పాటు చేస్తారు. దాన్ని ప‌ట్టుకుని ఆల‌యం వ‌ర‌కు వెళ్లి తిరిగి రావాలి.

స్తంభేశ్వ‌ర‌నాథ ఆల‌యంలోకి వెళ్ల‌డం రిస్క్‌తో కూడుకున్న ప‌ని కనుక‌.. 70 ఏళ్ల‌కు పైబ‌డిన వారిని, 10 ఏళ్ల లోపు వారిని అనుమ‌తించ‌రు. ఇక ఈ ఆల‌యంలో పూజారులు ఎవ‌రూ ఉండ‌రు. భ‌క్తులే శివ‌లింగానికి అభిషేకం చేస్తారు. పూలు స‌మ‌ర్పిస్తారు. లింగం మునిగాక ఆ పూలు ఒడ్డుకు వ‌స్తాయి. వాటిని భ‌క్తులు ప‌ర‌మ ప‌విత్రంగా భావిస్తారు. ఆ పూలు దొరికితే తాము కోరిన‌వి నెర‌వేరుతాయ‌ని, ఇంట్లో వాటిని పెట్టుకుంటే స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు. ఇక ఆల‌యం మునిగిపోయే, తేలే దృశ్యాల‌ను తీరం నుంచి చూసేందుకు కూడా చాలా మంది భ‌క్తులు ఇక్క‌డికి వ‌స్తుంటారు. అయితే ఆ రెండు స‌న్నివేశాల‌ను చూడాలంటే అక్క‌డ ఒక రోజు గ‌డ‌పాల్సి ఉంటుంది.

ఈ ఆల‌యాన్ని నిర్మించి కొన్ని వంద‌ల ఏళ్లు అవుతున్నా, అది రోజూ మునిగి, తేలుతున్నా.. ఆ ఆల‌యం ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌క‌పోవ‌డం విశేషం. అలాగే పౌర్ణ‌మి రోజుల్లో ఈ ఆల‌యంలోని శివ‌లింగం ఒక ర‌క‌మైన కాంతితో మెరిసిపోతుంద‌ని భ‌క్తులు చెబుతారు. ఆ రోజు స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకోవ‌డం చాలా రిస్క్ అని, ఒక వేళ ద‌ర్శ‌నం చేసుకుంటే మాత్రం ఎంతో పుణ్యం ద‌క్కుతుంద‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. ఇక ఆల‌యానికి సంబంధించి స్థ‌ల పురాణం చెబుతున్న‌దేమిటంటే.. పూర్వం తార‌కాసురుడ‌నే రాక్ష‌సున్ని వ‌ధించిన త‌రువాత కుమార‌స్వామి శివ‌లింగాన్ని ఇక్క‌డ ప్ర‌తిష్టించి పూజ‌లు చేశాడ‌ని చెబుతారు. దాని గురించి స్కంద పురాణంలో ఉంటుంద‌ట‌. ఇక మ‌రో క‌థ ప్ర‌కారం కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పాండ‌వులు ఇక్క‌డికి వ‌చ్చి శివ‌లింగాన్ని ఏర్పాటు చేసి పూజించార‌ని చెబుతారు. క‌నుక‌నే ఈ శివలింగాన్ని ద‌ర్శించుకుంటే స‌ర్వ పాపాలు పోతాయ‌ని భ‌క్తులు న‌మ్ముతారు.

ఈ ఆల‌యానికి వెళ్లాల‌నుకుంటే వ‌డోద‌ర వెళ్లాలి. అక్క‌డి నుంచి 52 కిలోమీట‌ర్ల దూరంలో క‌వికాంబోయి ఉంటుంది. అహ్మ‌దాబాద్ లేదా వ‌డోద‌ర‌ల‌లో ఏ ప్రాంతానికి చేరుకున్నా స‌రే.. వాటి నుంచి క‌వికాంబోయికి వెళ్ల‌వ‌చ్చు. అయితే అక్క‌డికి వెళ్లాలంటే బ‌స్సు క‌న్నా ట్యాక్సీ అయితేనే ఉత్త‌మం. సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఇక క‌వికాంబోయి వెళ్లాక అక్క‌డ ఉండే స‌ముద్ర‌పు ఒడ్డు నుంచి సుమారు ఒక‌టిన్న‌ర కిలోమీట‌ర్ల దూరం కాలిన‌డ‌క‌న వెళ్తే ఈ ఆల‌యానికి చేరుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM

తాప్సీ ఫైర్.. స్టార్ల స్టాఫ్‌పై నిర్మాతల ఆరోపణల్లో నిజం లేదు!

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వ‌స్తార‌ని, దీంతో వారికి చేసే ఖ‌ర్చు గ‌ణ‌నీయంగా…

Thursday, 12 March 2026, 4:59 PM