పాములను చూస్తే కొందరు ఎంతో భయంతో ఆమడ దూరం పరిగెడతారు. మరికొందరు పాము అనే పేరు వినగానే తీవ్ర భయాందోళనలకు గురవుతారు. అదేవిధంగా రాత్రి సమయంలో పాము కనిపించినట్లు కలవరపడుతుంటారు. కలలోనూ కొందరికి పాములు కనిపిస్తుంటాయి. ఈ విధంగా పాము అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ విధంగా పాము భయం ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే భయం తొలగిపోతుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకు 10 కి.మీ దూరంలో కుడుపు అనే గ్రామం ఉంది. కుడుపు అనగా తుళు భాషలో పాముతో ఉన్న బుట్ట అనే అర్థం వస్తుంది. ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి పాము ఆకృతిలో ఉండే ఐదు తలలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఎవరినైతే పాము భయం వెంటాడుతుందో అలాంటి వారు ఈ ఆలయంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల వారికి పాము నుంచి కలిగే భయం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రతి సోమవారంతోపాటు శ్రావణ మాసంలోని 5వ రోజు వచ్చే నాగపంచమికి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకొని అనంతపద్మనాభ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో ఈ గ్రామంలోని మహిళలు ఆవు పేడ, ఆవు పాలను కలిపి తమ ఇంటి గోడలపై పాము చిత్రాలను గీస్తారు.
ఈ విధంగా పాము బొమ్మలు గీయటం వల్ల వారికి పాము కాటు వేయదని అక్కడి ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే పాము భయం ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల పాము భయం పూర్తిగా తొలగిపోతుందని విశ్వసిస్తారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…