పాములను చూస్తే కొందరు ఎంతో భయంతో ఆమడ దూరం పరిగెడతారు. మరికొందరు పాము అనే పేరు వినగానే తీవ్ర భయాందోళనలకు గురవుతారు. అదేవిధంగా రాత్రి సమయంలో పాము కనిపించినట్లు కలవరపడుతుంటారు. కలలోనూ కొందరికి పాములు కనిపిస్తుంటాయి. ఈ విధంగా పాము అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ విధంగా పాము భయం ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే భయం తొలగిపోతుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకు 10 కి.మీ దూరంలో కుడుపు అనే గ్రామం ఉంది. కుడుపు అనగా తుళు భాషలో పాముతో ఉన్న బుట్ట అనే అర్థం వస్తుంది. ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి పాము ఆకృతిలో ఉండే ఐదు తలలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఎవరినైతే పాము భయం వెంటాడుతుందో అలాంటి వారు ఈ ఆలయంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల వారికి పాము నుంచి కలిగే భయం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రతి సోమవారంతోపాటు శ్రావణ మాసంలోని 5వ రోజు వచ్చే నాగపంచమికి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకొని అనంతపద్మనాభ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో ఈ గ్రామంలోని మహిళలు ఆవు పేడ, ఆవు పాలను కలిపి తమ ఇంటి గోడలపై పాము చిత్రాలను గీస్తారు.
ఈ విధంగా పాము బొమ్మలు గీయటం వల్ల వారికి పాము కాటు వేయదని అక్కడి ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే పాము భయం ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల పాము భయం పూర్తిగా తొలగిపోతుందని విశ్వసిస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…