Theertham : మనం దైవ దర్శనం కొరకు, మానసిక ప్రశాంతత కొరకు అప్పుడప్పుడూ దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. దేవాలయాల్లో దైవ దర్శనం, పూజాది కార్యక్రమాలు ముగిసిన తరువాత మనకు అర్చకులు తీర్థాన్ని ఇస్తారు. చాలా మంది తీర్థాన్ని తీసుకున్న తరువాత దానిని సేవించి ఆ చేతిని తలకు రుద్దుకుంటూ ఉంటారు. అసలు తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతిని తలకు తుడుచుకోవచ్చా లేదా..అసలు శాస్త్రం ఏం చెబుతుంది..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేవాలయంలో మూల విరాట్ ను అభిషేకించిన జలం మాత్రమే తీర్థం అవుతుంది. ఉత్సవ విగ్రహాలకు, అర్చనా మూర్తులకు అభిషేకించిన జలం తీర్థం అవ్వదని పండితులు చెబుతున్నారు. తీర్థం తీసుకునే సమయంలో చూపుడు వేలును బొటన వేలుతో మూయాలి.
అర చేతిలో తీర్థాన్ని అర్చకుడు వేసిన తరువాత దానిని బ్రహ్మ నాభి ద్వారా అనగా చేతికి మధ్యలో ఉండే ఆయుర్ధాయం రేఖ ద్వారా తీర్థాన్ని తీసుకోవాలి. ఈ తీర్థాన్ని కూడా పెదవులకు, దంతాలకు తాకకుండా తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తీర్థాన్ని నేరుగా నాలుక మీద పడేలా తీసుకోవాలి. తీర్థం పెదవులకు తాకడం వల్ల ఎంగిలి అవుతుంది. అదే దంతాలకు తాకడం వల్ల చర్విత చరన దోషం అవుతుంది. దంతాలకు, పెదవులకు గనుక తీర్థం తాకితే తాకిన వెంటనే చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతేకానీ తీర్థం తీసుకున్న తరువాత చేతికి తలకు తుడుచుకోకూడదు. తలకు తుడుచుకోవడం వల్ల దోషం అవుతుందని పండితులు చెబుతున్నారు.
ఆలయాల్లో చేతులు శుభ్రం చేసుకునేంత తీరిక, సమయం ఉండదు కనుక చేతిని రుమాలుకు తుడుచుకోవాలని పండితులు చెబుతున్నారు. చేతిని నీటితో కడుక్కునే వీలు లేని వారు తీర్థం తీసుకునేటప్పుడే కండువ లేదా రుమాలును నాలుగు మడతలుగా మడిచి రెండు చేతుల మధ్యలో ఉంచి తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థం తీసుకున్న తరువాత చేతిని కండువా లేదా రుమాలుకు తుడుచుకోవాలి. స్త్రీలైతే కొంగుకు తుడుచుకోవాలి. తీర్థం తీసుకున్నతరువాత కండువాకు తుడుచుకోవడం కూడా దోషమే అవుతుంది. కానీ మనం దర్శనం కోసం వరుసలో నిలబడడం వల్ల చేతిని కడుక్కునే వీలు ఉండదు కనుక చేతిని కండువాకు తుడుచుకోవాలి తప్ప తలకు తుడుచుకోకూడదని పండితులు చెబుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…