Jowar Flour : పూర్వం మన పెద్దలు ఆరోగ్యకరమైన ఆహారం తినే వారు. అందుకనే వారు ఎక్కువ ఏళ్ల పాటు జీవించగలిగారు. కానీ మనం వారు తిన్న ఆహారాన్ని మరిచిపోతున్నాం. జంక్ ఫుడ్నే ఎక్కువగా తింటున్నాం. అందువల్ల రోగాల బారిన పడుతున్నాం. అందువల్ల మన పెద్దలు తిన్న ఆహారాలనే మనం కూడా తినాలి. ఇక అలాంటి ఆహారాల్లో జొన్నలు కూడా ఒకటి. పూర్వం మన పెద్దలు జొన్నలతో రొట్టెలు, సంగటి, బువ్వ చేసుకుని తినేవారు. అయితే సంగటి, బువ్వ తినడం కష్టం. కానీ జొన్న పిండితో రొట్టెలను చేసుకుని తినవచ్చు. వీటిని ఎవరైనా సరే చేసుకోవచ్చు. జొన్న పిండితో జావ కూడా చేసి తాగవచ్చు. దీంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి.
జొన్నల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి. చిన్నారుల్లో అయితే ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పొడవుగా పెరుగుతారు. జొన్నల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఇక జొన్నల్లో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
జొన్నలను తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. దీంతో అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. జొన్నలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే జ్వరాలు రావు. రోగాల బారి నుంచి శరీరం సురక్షితంగా ఉంటుంది.
జొన్నలను తీసుకోవడం వల్ల పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. దీని వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో గుండె జబ్బులు రావు. హార్ట్ ఎటాక్లు రాకుండా చూసుకోవచ్చు. ఇలా జొన్నలతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ తీసుకోవాలి.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…