త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పరమేశ్వరుడిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పరమేశ్వరుడి గురించి మనకు శివపురాణంలో ప్రతి విషయం చెప్పబడింది. శివ పురాణం ప్రకారం పూర్వజన్మలో కుబేరుడు ఒక దొంగగా ఉండేవాడు. పూర్వజన్మలో దొంగ అయిన కుబేరుడు తరువాత జన్మలో అధిక ధనికుడుగా మారాడు.
పూర్వజన్మలో అతని పేరు గొన్నిధి. ఒకానొక దశలో తినడానికి తిండి కూడా లేకపోవడంతో దొంగగా మారాడు. ఈ క్రమంలోనే ఒక శివాలయంలో అధిక మొత్తంలో బంగారు ఆభరణాలు కనిపించడంతో వాటిని దొంగతనం చేయాలని గొన్నిది భావిస్తాడు. ఆ సమయంలోనే ఆలయంలోకి ప్రవేశించగానే పెద్ద ఎత్తున గాలులు వీచడంతో ఆలయంలో ఉన్న దీపం ఆరిపోతుంది.
ఆలయంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించడం కోసం గొన్నిధి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయితే ఎంత వెలిగించినా దీపం వెలుగదు. అలా ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో విసుగు చెందిన అతను తన చొక్కాతీసి మంటపెట్టి దాంతో దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యి గణాల్లో ఒక అధిపతిని చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మలో కుబేరుడిగా పుట్టి సంపదకు రక్షకుడిగా ఉంటాడు. ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు సంధ్యాసమయంలో శివుడి ముందు దీపం వెలిగించి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని.. శివపురాణం తెలియజేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…