త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పరమేశ్వరుడిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పరమేశ్వరుడి గురించి మనకు శివపురాణంలో ప్రతి విషయం చెప్పబడింది. శివ పురాణం ప్రకారం పూర్వజన్మలో కుబేరుడు ఒక దొంగగా ఉండేవాడు. పూర్వజన్మలో దొంగ అయిన కుబేరుడు తరువాత జన్మలో అధిక ధనికుడుగా మారాడు.
పూర్వజన్మలో అతని పేరు గొన్నిధి. ఒకానొక దశలో తినడానికి తిండి కూడా లేకపోవడంతో దొంగగా మారాడు. ఈ క్రమంలోనే ఒక శివాలయంలో అధిక మొత్తంలో బంగారు ఆభరణాలు కనిపించడంతో వాటిని దొంగతనం చేయాలని గొన్నిది భావిస్తాడు. ఆ సమయంలోనే ఆలయంలోకి ప్రవేశించగానే పెద్ద ఎత్తున గాలులు వీచడంతో ఆలయంలో ఉన్న దీపం ఆరిపోతుంది.
ఆలయంలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించడం కోసం గొన్నిధి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయితే ఎంత వెలిగించినా దీపం వెలుగదు. అలా ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో విసుగు చెందిన అతను తన చొక్కాతీసి మంటపెట్టి దాంతో దీపాన్ని వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యి గణాల్లో ఒక అధిపతిని చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మలో కుబేరుడిగా పుట్టి సంపదకు రక్షకుడిగా ఉంటాడు. ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు సంధ్యాసమయంలో శివుడి ముందు దీపం వెలిగించి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని.. శివపురాణం తెలియజేస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…