సాధారణంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ఎన్నో కట్టుబాట్లను ఆచార వ్యవహారాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే పెళ్లైన మహిళలు నిత్యం సుమంగళిగా ఉండాలని నుదుటిన తిలకం, మెడలో మంగళ సూత్రం, కాలికి మెట్టెలు, చేతులకు గాజులు ధరించి ఉంటారు. ఈ విధంగా ధరించడం వల్ల తను దీర్ఘసుమంగళీగా ఉంటుందని భావిస్తారు.
మన సంప్రదాయాల ప్రకారం గాజులకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏదైనా శుభకార్యం జరిగినా మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చిన వారికి పసుపు, కుంకుమతో పాటు గాజులను ఇవ్వడం ఆచారం. ఇలా మట్టి గాజులు ధరించడం వల్ల వారి భర్త ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. అందుకోసమే పెళ్లైన మహిళలు తప్పనిసరిగా గాజులను ధరించాలని పెద్ద వారు చెబుతుంటారు.
ఈ విధంగా గాజులను ధరించడం ఒక ఆచారం అయితే సైన్స్ పరంగా గాజులను ధరించడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చేతికి గాజులు ధరించడం వల్ల మణికట్టు వద్ద రాపిడి జరిగి మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అదేవిధంగా మనకు శక్తిని కూడా పెంచుతుంది. మనకు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు లేకుండా ఉండటమేకాకుండా మన శరీరంలో ఉన్న వేడిని బయటకు తొలగిస్తుంది. అందుకోసమే కేవలం మట్టి గాజులను మాత్రమే ధరించాలని మన పెద్దవారు చెబుతుంటారు.ఈ విధంగా గాజులు ధరించడం ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…