Rama Setu : రామాయణం గురించి అందరికీ తెలిసిందే. చిన్నారులు మొదలు కొని పెద్దల వరకు అందరూ ఇప్పటికే చాలా సార్లు రామాయణాన్ని చదివి ఉంటారు. సినిమాలు, టీవీ సీరియల్స్లో ఈ పురాణాన్ని గురించి తెలుసుకుని ఉంటారు కూడా. విద్యార్థులకైతే పాఠ్యాంశాల్లోనూ రామాయణ, మహాభారతాల గురించి తెలుస్తుంటాయి. రామాయణంలో సీతారాముల జననం మొదలుకొని చివరికి లవకుశుల వరకు దాదాపుగా అన్ని ఘట్టాల గురించి అందరూ విని ఉంటారు. అయితే రామాయణం గురించి మనం తెలుసుకోవాల్సిన పలు ఆసక్తికరమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..
లంకా నగరాన్ని హనుమంతుడైతే గాల్లో ఎగిరి చేరుకుంటాడు. అదే రావణుడిపై యుద్ధానికి వెళ్లేందుకు రాముడు, లక్ష్మణుడు సహా వానర సేన మొత్తం సముద్రాన్ని దాటేందుకు దానిపై రాళ్లతో వంతెన నిర్మిస్తారు కదా. అది కొన్ని వందల మైళ్ల దూరం ఉంటుంది. దాన్ని రామసేతువు అని కూడా అంటారు. అయితే ఆ వంతెనను వానర సేన కేవలం 5 రోజుల్లోనే నిర్మించిందట. అంత తక్కువ కాలంలోనే అంత పొడవాటి వంతెనను అప్పట్లో నిర్మించారట. రావణుడితో యుద్ధం చేసేందుకు వెళ్లినప్పుడు రాముడికి ఇంద్రుడు తన వద్ద ఉన్న బంగారు రథాన్ని ఇచ్చాడట. దాని సహాయంతోనే రాముడు రావణుడిపై యుద్ధం చేసేందుకు వెళ్లాడట.
రావణుడు సీతను అపహరించుకుపోయి లంకలో ఉంచుతాడు కదా. అనంతరం ఆమె జాడ తెలుసుకునేందుకు హనుమంతుడు వస్తాడు. ఆ తరువాత యుద్ధం జరిగాక సీత మళ్లీ రాముడి వద్దకు వెళ్తుంది. అయితే సీత తాను అపహరణకు గురైన తరువాత మళ్లీ రామున్ని చేరే వరకు లంకలో 10 నెలల పాటు ఉందట. కైకేయి కోరిక మేరకు దశరథుడు రామున్ని అరణ్య వాసం చేయమని పంపుతాడు కదా. అప్పుడు రాముడి వయస్సు 27 సంవత్సరాలట. సీత చనిపోయాక రాముడు తన కొడుకులిద్దరు లవకుశులను తీసుకుని అయోధ్యకు వచ్చి వారికి పట్టాభిషేకం చేశాక తాను అవతారం చాలిస్తాడు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…