Dishti : జీవితం అన్నాక కష్టాలు ఉంటాయి. సుఖాలు ఉంటాయి. కొందరికి అన్నీ కలిపి ఉంటాయి. కానీ కొందరికి మాత్రం నిరంతరం సుఖాలే ఉంటాయి. కొందరికి నిరంతరం కష్టాలే వస్తుంటాయి. ఏం చేసినా కష్టాల నుంచి బయట పడలేకపోతుంటారు. అయితే ఇందుకు వారి పొరపాటు ఏమీ ఉండదు. కానీ ఇంట్లో ఏవైనా దోషాలు ఉన్నా లేదా ఇంట్లో ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా ఇలాగే జరుగుతుంది. దీంతో ఏ పనీ పూర్తవదు. ఏదీ కలిసి రాదు. అన్నింటా నష్టాలే వస్తుంటాయి. పైగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుండదు. ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఉంటే వారు ఏమాత్రం ఆలస్యం చేయరాదు. కింద చెప్పిన విధంగా వెంటనే పరిహారం చేయాల్సి ఉంటుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గృహంలోని ప్రతికూల శక్తులకు చెక్ పెట్టేలా ఉప్పు, ఎండు మిరపకాయలు పనిచేస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఆదాయం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అనారోగ్య సమస్యలు వేధించడం వంటివి ప్రతికూల శక్తులు ఇంట్లో ఉన్నాయని చెప్పేందుకు ఉదాహరణలుగా భావించవచ్చు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది.
రాళ్ల ఉప్పు, నాలుగు ఎండు మిరపకాయలు, ఒక నిమ్మపండు, ఒక గాజు గిన్నె తీసుకోవాలి. ఈ పరిహారాన్ని మంగళవారం పూట చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును నింపాలి. తరువాత ఒక నిమ్మ పండును రాళ్ల ఉప్పుపై ఉంచాలి. తరువాత నాలుగు ఎండు మిరపకాయలను ఉప్పుకు నాలుగు వైపులా నిలబెట్టాలి. దీంతో చిత్రంలో వచ్చిన విధంగా ఏర్పడుతుంది. ఇక ఇలా చేయడం వల్ల పరిహారం పూర్తవుతుంది. ఇలా ప్రతి మంగళవారం చేయాలి.
మిరపకాయల చివర్లు ఇంట్లోని ప్రతికూలతలను, దుష్ట శక్తులను తొలగిస్తాయి. అలాగే వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల తప్పక ఫలితం కనిపిస్తుంది. ఆశించిన రీతిలో అన్నీ అనుకూలిస్తాయి. ఇంట్లో నుంచి దుష్టశక్తులు వెళ్లిపోతాయి. ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఏది చేసినా కలసి వస్తుంది. అందరి ఆరోగ్యం బాగుంటుంది. ధనం బాగా సంపాదిస్తారు. కనుక ఇలా చేసి ప్రయోజనాలను పొందవచ్చు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…