Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండి, మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే, పూజగదిలో ఈ వస్తువులని పెట్టండి. ఈ వస్తువులను కనుక మీరు పూజ గదిలో పెట్టినట్లయితే, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి పూజ గదిలో ఎటువంటి వస్తువులను పెట్టాలి..?, లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పూజ గదిలో ఈ వస్తువులను కనుక మీరు పెట్టినట్లయితే ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ఇష్ట దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పూజ చేయాలి. అయితే పూజ సమయంలో మనం గంటని మ్రోగిస్తాము. పూజ గదిలో గంటని పెట్టినట్లయితే దుష్టశక్తులు తొలగిపోతాయి. ఆర్థిక బాధలు ఉండవు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పూజ గదిలో నెమలి ఈకని పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది.
ఆర్థికంగా కూడా దృఢంగా ఉండచ్చు. ఆర్థిక బాధలు ఏమీ కూడా ఉండవు. కాబట్టి నెమలి ఈకని కూడా పూజ గదిలో పెట్టుకోండి. దీపం లేకపోతే పూజ అసంపూర్ణం. పూజ గదిలో దీపాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. పూజ గదిలో దీపాన్ని పెట్టినప్పుడు పడమర వైపు పెట్టండి. అలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.
పూజ గదిలో శంఖాన్ని పెడితే కూడా సిరిసంపదలు కలుగుతాయి. పూజ గదిలో నీళ్లు నింపిన కలశాన్ని పెడితే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతంగా ఉండొచ్చు. గంగాజలాన్ని పూజ గదిలో పెడితే కూడా చాలా మంచి కలుగుతుంది. పూజగదిలో ఇత్తడి లేదంటే వెండి పాత్రలో గంగాజలం పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ఇలా వీటిని పూజ గదిలో పెట్టినట్లయితే ఆర్థిక బాధలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…