Pooja : ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని కొందరంటే.. ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా ఓ పురుషుడు ఉంటాడని కొందరు అంటారు. సరే ఈ విషయం ఎలా ఉన్నా పూజలు, యాగాలు చేసినప్పుడు, దేవాలయాలను సందర్శించినప్పుడు మాత్రం దంపతులిద్దరూ కలిసే ఆ పనులు చేయాలని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. అయితే దీని వెనుక ఉన్న కారణాలేంటో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం స్త్రీని శక్తితో పోల్చారు. కనుక శక్తి రూపంలో ఉండే స్త్రీ పక్కన ఉండగా పూజ చేస్తే ఆ పురుషునికి అన్నింటా విజయం సిద్దిస్తుందట. అందుకే దంపతులిద్దరూ కలసి పూజలు చేయాలని, దేవాలయాలను దర్శించాలని చెబుతున్నారు.
దంపతులిద్దరూ ఒకరి శరీరంలో మరొకరు సగభాగం అంటారు. అందుకు పరమశివున్ని అర్థనారీశ్వరుని రూపంలో కొలుస్తారు. ఈ క్రమంలో వారు కష్ట సుఖాల్లోనే కాదు, పూజలు చేసినప్పుడు, ఆలయాల వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు కలిసే ఆ పనులు చేస్తే దాంతో ఆ ఫలితం ఇద్దరికీ కలుగుతుందట. కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో చాలా మంది రాజులు తమ భార్యలు పక్కన లేనప్పుడు వారికి చెందిన బంగారు విగ్రహాలతో పూజలు చేసే వారు కదా. అలాగే ఇప్పుడు కూడా భార్యాభర్తలిద్దరూ చేయాలట. దాంతో ఆ యాగ ఫలితం సంపూర్ణంగా వారికి దక్కుతుందట.
పెళ్లి చేసుకున్నప్పుడు దంపతులిద్దరూ అన్ని విషయాల్లోనూ ఇద్దరూ సమంగా పాలు పంచుకుంటామని పంచ భూతాల సాక్షిగా ప్రమాణం చేస్తారు కదా. మరి అలాంటప్పుడు పుణ్యక్షేత్రాల సందర్శన, పూజలు చేసినప్పుడు కూడా భార్యభర్తలిద్దరూ పాల్గొంటేనే అది పరిపూర్ణం అయి ఫలితం దక్కుతుంది. లేదంటే సగం ఫలమే దక్కుతుంది. కనుక పూజలు చేసినా.. ఆలయాలను సందర్శించినా.. దంపతులు ఇద్దరూ కలిసే వాటిని చేస్తే.. పూర్తి స్థాయిలో ఫలితాన్ని పొందవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…