Marriage : వివాహం అనేది ప్రతి మనిషికి జీవితంలో చాలా ముఖ్యమైనది. దాదాపుగా ఎవరికైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే శుభ సందర్భం అది. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు వివాహ వేడుకకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అలాంటి శుభ సందర్భం మళ్లీ మళ్లీ రాదు. అయితే చాలా మందికి సరైన సమయంలో పెళ్లిళ్లు అవుతాయి. ఇక కొందరికి కొంచెం అటో, ఇటో సమయం ఎక్కువైనా, తక్కువైనా పెళ్లి జరుగుతుంది. కానీ కొందరికి మాత్రం వివాహం అస్సలు కాదు. అందుకు అనేక కారణాలు ఉంటాయి.
కొందరికి అసలు ఏ సమస్యా లేకున్నా వివాహం కాదు. అందుకు కారణాలు ఏంటో కూడా తెలుసుకోలేకపోతారు. అయితే ఇలాంటి వారు కింద చెప్పిన విధంగా చేస్తే దాంతో వారికి త్వరగా వివాహం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి వారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.. వివాహం అస్సలు కావడం లేదని బాధపడేవారు ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతి మంగళవారం 108 తమలపాకులతో ఆయనకు పూజ చేయాలి. ఇలా 8 మంగళవారాల పాటు చేయాలి. దీంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది. త్వరగా వివాహం అవుతుంది.
శని దోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు అందుకు ఇలా చేయాలి. వారు తమలపాకుల్లో తేనె పోసి అనంతరం వాటిని చీమలకు ఆహారంగా పెట్టాలి. దీంతో దోషం నివారణ అవుతుంది. ఫలితంగా వివాహం త్వరగా అవుతుంది. ఇక పైన చెప్పిన వాటితోపాటు కింద ఇచ్చిన మంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు పారాయణం చేయాలి. దీంతో ఇతర ఏవైనా దోషాలు ఉంటే అవి పోతాయి. వివాహానికి ఉండే అడ్డంకులు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. ఇక ఆ మంత్రం ఏమిటంటే..
దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వసౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయినీ.. ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు పఠించాలి. అనుకున్న ఫలితం త్వరగా వస్తుంది. వివాహం త్వరగా అవుతుంది. సమస్యలు ఉండవు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…