Mariamman Temple : మన దేశంలో అత్యంత చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో చాలా ఆలయాలను మహిమాన్వితమైనవిగా చెబుతారు. మనుషులు ఎప్పటి నుంచో అలాంటి ఆలయాల్లో పూజలు చేస్తున్నారని స్థల పురాణాలు కూడా చెబుతుంటాయి. అలాంటి ఆలయాల్లో తమిళనాడుకు చెందిన మరిఅమ్మన్ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం స్థానికంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ దుర్గా దేవి భక్తులకు మరిఅమ్మన్గా దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో విజయరాయ చక్రవర్తి నిర్మించారు. అయితే అంతకు కొన్ని వందల ఏళ్ల ముందు నుంచే ఆలయం లేనప్పుడే ఈ అమ్మవారిని పూజించడం మొదలు పెట్టారు.
ఇక్కడ అమ్మవారికి ఏదైనా సమర్పిస్తే భక్తులు కోరిన కోర్కెలను నెరవేరుస్తుందని నమ్మకం. అందుకనే చాలా మంది బెల్లం, బియ్యం, నెయ్యితో చేసే మవిళక్కు అనబడే ఓ ప్రత్యేకమైన వంటకాన్ని ఇక్కడ వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే స్థోమతను బట్టి వెండి లేదా ఉక్కుతో తయారు చేసిన లోహపు వస్తువులను ఇక్కడ విరాళంగా ఇస్తారు. హుండీల్లో వాటిని వేస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారు అనుగ్రహిస్తుందని నమ్ముతారు.
ఇక ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు ఎలాంటి మొండి వ్యాధులు అయినా సరే నయమవుతాయని భక్తుల విశ్వాసం. పూర్వ కాలంలో ఈ ప్రాంతంలో ప్రజలకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయట. అప్పుడు భక్తులు అమ్మవారికి పూజలు చేసి వేడుకున్నారట. దీంతో వారి రోగాలు అన్నీ నయమయ్యాయట. అందుకనే రోగాలను నయం చేసే అమ్మగా ఈ దేవి ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక ఈ ఆలయంలో ప్రతి ఆది వారం, మంగళవారం, శుక్రవారాలతోపాటు సెలవు రోజుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇక్కడికి రావాలంటే భక్తులు చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్ లకు వచ్చి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…