Lord Vishnu Mantram : ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని వల్లి వేస్తూ, ఒక ముసలి ఆయన గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్ష వేసుకున్నారు. ఆయన చదువుతుండడం వలన ఆ తరంగాలు కలిపురుషున్ని తాకాయి. ఎక్కడినుండి ఇది వస్తోందని చూస్తుంటే.. అతను జపించడము చూసి, ఆపాలని ఆ ముసలి వాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. కానీ, ఆయన చేయి వేసిన వెంటనే అర కిలో మీటర్ దూరంలో పడిపోయాడు. ఏం జరిగిందో తెలియక, ముసలి అయిన మళ్లీ మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నారు.
ఈసారి మళ్లీ ఆపబోతే, ఇంకా ఎక్కువ దూరంలో పడ్డాడు. కలి పురుషుడు గజగజ వణికిపోయాడు. చూస్తే ముసలి ఆయన. పట్టుకుని ఉంటే ఎక్కడికో వెళ్లి పడుతున్నాను నా శక్తి ఏమైనా సన్నగిల్లిందా..? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన, నా రాక ఆలస్యం అయింద..? కృష్ణుడు మాయా ప్రభావం ఇదా..? ఆ ముసలివాడు ఎవడు..? శివుడా, విష్ణువా అనుకుంటూ వెళ్తుంటే వేద వ్యాసుడు కనపడ్డాడు.
కలి వెంటనే, వ్యాసుడు దగ్గరికి వెళ్లి సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అడిగితే, వ్యాసుడు నవ్వి ఇది నీ రాజ్యం. ఈ కలికాలం నీది. నీకు సందేహమా అని అంటాడు. ఇంతకీ నువ్వు కుశలమే కదా అని అంటాడు. కుశలమే, నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించావు కదా..? అదిగో దూరంగా వెళుతున్నాడు. ఆ ముసలివాడు ఎవరు అని అడుగుతాడు. అదా నీ సందేహం.
ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన, విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వకుండా చూస్తుంది. పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే.. నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు అని చెప్తాడు. త్రికరణ శుద్ధిగా ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని ఎవరు పటిస్తారో.. వాళ్లని కనీసం నువ్వు తాకని కూడా తాకలేవు అని చెప్తారు. ఇది ఈ మంత్రం యొక్క విశిష్టత. ఇంత మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తే, ఎంత లాభం ఉంటుందో అర్థమైంది కదా..? ఓం నమో భగవతే వాసుదేవాయ.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…