మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం లేదా పండుగలు చేసినప్పుడు ముందుగా వినాయకుడికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా శుభకార్యం పూర్తవుతుందని భావిస్తారు. అందుకే తొలిపూజను వినాయకుడికే చేస్తారు. అయితే వినాయకుడిని గణనాథుడు, విగ్నేశ్వరుడు, లంబోదరుడు, ఏకదంతుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. మరి వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తారు ఇక్కడ తెలుసుకుందాం..
పార్వతి దేవి వినాయకుడిని ప్రతిష్ఠించి తనకు ప్రాణం పోసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వినాయకుడిని కైలాస ద్వారం వద్ద కాపలాగా ఉంచుతుంది.ఈ క్రమంలోనే కైలాసంలోకి వెళ్లాలని వచ్చిన పరమేశ్వరుడిని వినాయకుడు అడ్డుకోవడంతో వినాయకుడు ఎంతో ఆగ్రహం చెంది వినాయకుడి తలను ఖండిస్తాడు. ఈ క్రమంలోనే వినాయకుడికి ఏనుగు తలను తీసుకువచ్చి సమర్పిస్తారు. అందుకే వినాయకుడిని గజముఖుడు అని కూడా పిలుస్తారు.
ఈ క్రమంలోనే ఒకసారి శివపార్వతులు ఏకాంతంలో సమయంలో ఉండగా వినాయకుడు కైలాస ద్వారం వద్ద కాపలా ఉంటాడు. ఈ క్రమంలోనే పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసం పరశురాముడు కైలాసానికి చేరుకుంటాడు. కైలాసానికి వచ్చిన పరశురాముని వినాయకుడు బయటనే ఉంచి అతనిని లోపలికి పంపకుండా అడ్డుకుంటాడు. ఇలా వీరిరువురి మధ్య మాటల యుద్ధం మొదలవడంతో వినాయకుడు తన తొండంతో పరశురాముని పైకెత్తి కింద పడేసాడు. దీంతో ఆగ్రహం చెందిన పరశురాముడు తన గండ్రగొడ్డలితో వినాయకుడి పై దాడి చేయడంతో ఒక దంతం విరిగిపోతుంది. దీంతో అప్పటి నుంచి వినాయకుడిని ఏకదంతుడు అని పిలుస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…