Lemon Garland To Maa Kaali : ప్రతీ ఊళ్ళో కూడా అమ్మవారి ఆలయాలు ఉంటాయి. దుర్గా దేవి ఆలయం అని, గ్రామ దేవత ఆలయం అని ఇలా ఎన్నో అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. అయితే అమ్మవారిని మనం ఎప్పుడైనా గమనించినట్లయితే, అమ్మ వారికి నిమ్మకాయల దండల్ని వేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లోనే కాదు బోనాలు పండగ, దసరా పండుగ వంటివి జరిగినప్పుడు కూడా అమ్మవారికి నిమ్మకాయ దండల్ని వేస్తూ ఉంటారు. అయితే ఎందుకు అమ్మవారికి నిమ్మకాయ దండలు వేస్తారు..? దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
చాలా మంది కారణాలు ఏమిటి అనేది తెలుసుకోకుండా, పూర్వీకులు పాటించారు మనము పాటించాలని అలానే వారు కూడా పాటిస్తూ ఉంటారు తప్ప ఎందుకు అలా చేస్తున్నారు అనేది పట్టించుకోరు. కానీ నిజానికి ఇలాంటి పురాతన పద్ధతుల వెనుక పెద్ద కారణమే ఉంటుంది. ఎక్కువగా నిమ్మకాయ దండల్ని గ్రామ దేవతలకి వేస్తూ ఉంటారు.
లక్ష్మీ దేవి, సరస్వతి దేవి కి ఇలాంటి దండల్ని వేయరు. శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు, రక్షణ బాధ్యతల్ని కలిగి ఉంటుంది. నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. లయకారిణి శక్తి కదా అమ్మవారు, కాలస్వరూపమై దుష్టశక్తుల పాలిట సింహ స్వప్నమైన దేవికి తామస గుణం ఉంటుంది. అయితే అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె బలిప్రియ. అంటే బలి కోరుతుందన్నమాట.
ఆ బలికి మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సు కి ప్రతీక కూష్మాండం. అంటే గుమ్మడికాయ. అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ఉంటాము. అలానే అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండని, పులుపుగా ఉండే పులిహార ని కూడా నైవేద్యంగా పెడతాము. అలా చేస్తే, అమ్మవారు శాంతిస్తారు. అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయడం జరుగుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…