Lemon Garland To Maa Kaali : ప్రతీ ఊళ్ళో కూడా అమ్మవారి ఆలయాలు ఉంటాయి. దుర్గా దేవి ఆలయం అని, గ్రామ దేవత ఆలయం అని ఇలా ఎన్నో అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. అయితే అమ్మవారిని మనం ఎప్పుడైనా గమనించినట్లయితే, అమ్మ వారికి నిమ్మకాయల దండల్ని వేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లోనే కాదు బోనాలు పండగ, దసరా పండుగ వంటివి జరిగినప్పుడు కూడా అమ్మవారికి నిమ్మకాయ దండల్ని వేస్తూ ఉంటారు. అయితే ఎందుకు అమ్మవారికి నిమ్మకాయ దండలు వేస్తారు..? దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
చాలా మంది కారణాలు ఏమిటి అనేది తెలుసుకోకుండా, పూర్వీకులు పాటించారు మనము పాటించాలని అలానే వారు కూడా పాటిస్తూ ఉంటారు తప్ప ఎందుకు అలా చేస్తున్నారు అనేది పట్టించుకోరు. కానీ నిజానికి ఇలాంటి పురాతన పద్ధతుల వెనుక పెద్ద కారణమే ఉంటుంది. ఎక్కువగా నిమ్మకాయ దండల్ని గ్రామ దేవతలకి వేస్తూ ఉంటారు.
లక్ష్మీ దేవి, సరస్వతి దేవి కి ఇలాంటి దండల్ని వేయరు. శక్తి ఆలయాల్లో, గ్రామదేవతల ఆలయాల్లో ఈ ఆచారం ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు, రక్షణ బాధ్యతల్ని కలిగి ఉంటుంది. నిత్యం శత్రుసంహారాన్ని, లయత్వాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. లయకారిణి శక్తి కదా అమ్మవారు, కాలస్వరూపమై దుష్టశక్తుల పాలిట సింహ స్వప్నమైన దేవికి తామస గుణం ఉంటుంది. అయితే అమ్మ స్వయంగా శక్తి కాబట్టి ఆమె బలిప్రియ. అంటే బలి కోరుతుందన్నమాట.
ఆ బలికి మనం శిరస్సుని సమర్పించాలి. శిరస్సు కి ప్రతీక కూష్మాండం. అంటే గుమ్మడికాయ. అందుకే మనం దేవికి బలిగా గుమ్మడికాయని సమర్పిస్తూ ఉంటాము. అలానే అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండని, పులుపుగా ఉండే పులిహార ని కూడా నైవేద్యంగా పెడతాము. అలా చేస్తే, అమ్మవారు శాంతిస్తారు. అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయడం జరుగుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…