Kushmanda Deeparadhana : చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం కోసం కూడా చూస్తూ ఉంటారు. గ్రహ దోషం, రుణ దోషం, శత్రు దోషం, వాస్తు దోషం ఇలా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే, అటువంటి వాళ్ళు బుడద గుమ్మడికాయతో దీపారాధన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది, ఇటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయి. మరి ఇక ఇటువంటి దోషాలు పోవాలంటే ఏం చేయాలి, వాటి పరిహారాల గురించి చూద్దాం. పౌర్ణమి వెళ్లిన తర్వాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అని పిలుస్తారు. కృష్ణాష్టమి, కాలాష్టమి అని కూడా అంటారు.
కాలభైరవ స్వామికి ఈ అష్టమి చాలా ఇష్టం. అందుకని కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన చేస్తే మంచిది. ముందు దీపం ఎలా పెడతారో చూద్దాం. గుడికి వెళ్లి ఇది చేయకూడదు. ఇంట్లో మాత్రమే చేసుకోవాలి. దృష్టి దోషం, నరఘోష, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ బాగా ఉండటం, లేదంటే పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే మంచి పరిహారం. ఎవరైతే దీపారాధన చేయాలనుకుంటున్నారో వాళ్లు బూడిద గుమ్మడికాయని మధ్యకి కొయ్యాలి. ఆ తర్వాత అందులోని గుజ్జుని తీసేసి, దానికి పసుపు కుంకుమ పెట్టాలి.
నువ్వుల నూనె పోసి పత్తితో కానీ గుడ్డతో కానీ వత్తి వేసి వెలిగించాలి. దాని కింద ఇత్తడి పళ్లెం పెట్టాలి. దీపారాధన ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఇవన్నీ కూడా చేయాలి. ఆ తర్వాత వెలిగించిన బూడిద గుమ్మడి కాయకి నమస్కరించుకుని ముందు తల్లికి, తండ్రికి, గురువుకి, కుల దైవానికి, గ్రామదేవతకి, చండీమాతకి అలాగే ఆఖరిగా కాలభైరవ స్వామికి నమస్కారం చెప్పుకొని అప్పుడు ఇలా చెప్పుకోండి. నేను కూష్మాండ దీపారాధన చేస్తున్నాను జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు తొలగించి, సంతోషం, సౌభాగ్యం కావాలని కోరండి.
తర్వాత పంచోపచార పూజా చేసి అగరవత్తులు వెలిగించాలి. దీనిని గుమ్మడికాయకి గుచ్చండి. కాలభైరవ నామావళి లేదంటే అష్టకం చదువుకోవాలి. ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ధన యోగం కోసం అష్టమి నాడు, జనాకర్షణ కోసం అమావాస్యనాడు చేసుకోవాలి. ఈ దీపారాధన 19 అష్టమి తిథుల్లో కానీ 19 అమావాస్య తిథుల్లో కానీ చేస్తే మంచిది. పూజ అంతా అయిపోయాక ఎండు ఖర్జూరలని ప్రసాదంగా నైవేద్యం పెట్టాలి. పూజ చేసిన నాడు ఉపవాసం ఉండాలి. ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. ఉదయం 4:30 నుండి 6 మధ్యలో చేసేయాలి. భక్తిశ్రద్ధలతో ఈ పూజ చేస్తే పూర్తి నరదృష్టి, గ్రహవాస్తు పీడలు తొలగిపోతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…