Kushmanda Deeparadhana : చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి పరిష్కారం కోసం కూడా చూస్తూ ఉంటారు. గ్రహ దోషం, రుణ దోషం, శత్రు దోషం, వాస్తు దోషం ఇలా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే, అటువంటి వాళ్ళు బుడద గుమ్మడికాయతో దీపారాధన చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది, ఇటువంటి దోషాలు అన్నీ కూడా పోతాయి. మరి ఇక ఇటువంటి దోషాలు పోవాలంటే ఏం చేయాలి, వాటి పరిహారాల గురించి చూద్దాం. పౌర్ణమి వెళ్లిన తర్వాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అని పిలుస్తారు. కృష్ణాష్టమి, కాలాష్టమి అని కూడా అంటారు.
కాలభైరవ స్వామికి ఈ అష్టమి చాలా ఇష్టం. అందుకని కాలభైరవ స్వామికి కూష్మాండ దీపారాధన చేస్తే మంచిది. ముందు దీపం ఎలా పెడతారో చూద్దాం. గుడికి వెళ్లి ఇది చేయకూడదు. ఇంట్లో మాత్రమే చేసుకోవాలి. దృష్టి దోషం, నరఘోష, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ బాగా ఉండటం, లేదంటే పిల్లలు మాట వినకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లయితే మంచి పరిహారం. ఎవరైతే దీపారాధన చేయాలనుకుంటున్నారో వాళ్లు బూడిద గుమ్మడికాయని మధ్యకి కొయ్యాలి. ఆ తర్వాత అందులోని గుజ్జుని తీసేసి, దానికి పసుపు కుంకుమ పెట్టాలి.
నువ్వుల నూనె పోసి పత్తితో కానీ గుడ్డతో కానీ వత్తి వేసి వెలిగించాలి. దాని కింద ఇత్తడి పళ్లెం పెట్టాలి. దీపారాధన ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళే ఇవన్నీ కూడా చేయాలి. ఆ తర్వాత వెలిగించిన బూడిద గుమ్మడి కాయకి నమస్కరించుకుని ముందు తల్లికి, తండ్రికి, గురువుకి, కుల దైవానికి, గ్రామదేవతకి, చండీమాతకి అలాగే ఆఖరిగా కాలభైరవ స్వామికి నమస్కారం చెప్పుకొని అప్పుడు ఇలా చెప్పుకోండి. నేను కూష్మాండ దీపారాధన చేస్తున్నాను జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు తొలగించి, సంతోషం, సౌభాగ్యం కావాలని కోరండి.
తర్వాత పంచోపచార పూజా చేసి అగరవత్తులు వెలిగించాలి. దీనిని గుమ్మడికాయకి గుచ్చండి. కాలభైరవ నామావళి లేదంటే అష్టకం చదువుకోవాలి. ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. ధన యోగం కోసం అష్టమి నాడు, జనాకర్షణ కోసం అమావాస్యనాడు చేసుకోవాలి. ఈ దీపారాధన 19 అష్టమి తిథుల్లో కానీ 19 అమావాస్య తిథుల్లో కానీ చేస్తే మంచిది. పూజ అంతా అయిపోయాక ఎండు ఖర్జూరలని ప్రసాదంగా నైవేద్యం పెట్టాలి. పూజ చేసిన నాడు ఉపవాసం ఉండాలి. ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. ఉదయం 4:30 నుండి 6 మధ్యలో చేసేయాలి. భక్తిశ్రద్ధలతో ఈ పూజ చేస్తే పూర్తి నరదృష్టి, గ్రహవాస్తు పీడలు తొలగిపోతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…