చాలామంది వారికి జీవితంలో ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సాగిపోవాలని.. సంపదలు కలసి రావాలని భావిస్తారు. ఈ క్రమంలోనే డబ్బులను సంపాదిస్తుంటారు. ఇలా డబ్బులను సంపాదిస్తున్నప్పటికీ కొంత మంది దగ్గర ఏ మాత్రం డబ్బు నిల్వ ఉండదు. ఇలా చేతిలో డబ్బు నిల్వలేని వారు కొన్ని పనులను చేయటం వల్ల ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మనకు సంపద కలగాలని లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాము. మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాలని పండితులు తెలియజేస్తున్నారు.
మహిళలు ప్రతి రోజూ ఉదయం లేవగానే పాలు కాచడం అలవాటుగా ఉంటుంది. పాలు కాచే ముందు నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది కనుక పాలను కూడా సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ క్రమంలోనే పాలను కాచే ముందు.. ముందుగా పొయ్యిని (స్టవ్ని) శుభ్రం చేసుకొని గంధం, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి నమస్కరించుకోవాలి. ఇలా చేసిన అనంతరం పాలు కాచాలి.
అదే విధంగా చాలా మంది పాలను పొయ్యిపై పొంగిస్తుంటారు. ఇలా పాలు పొంగిన తర్వాత పాలలో రెండు బియ్యపు గింజలు వేస్తే అంతా శుభం జరుగుతుంది. అలాగే తొందరగా పాలు చల్లారాలని చాలా మంది పాలు కాగిన తర్వాత పాలపై ఉన్న మూతను తొలగిస్తారు. అలా చేయడం వల్ల పాల నుంచి ఆవిరి ఏ విధంగా అయితే బయటకు వెళ్తుందో అదే విధంగా మన ఇంట్లో ఉన్న సంపద మొత్తం వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. కనుక పాలు కాచే సమయంలో ఈ నియమాలను పాటించడం వల్ల మనం సంపాదించుకున్న డబ్బు వృథా ఖర్చు కాకుండా మన సంపదను వృద్ధి చేసుకోవచ్చు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…