తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన అక్కినేని నాగచైతన్య, సమంతల గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వీరి గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ సమంత – చైతన్య ఈ విషయంపై స్పందించలేదు. సమంత పలు ట్వీట్స్ చేస్తూ ఈ విషయాల గురించి బయట పెడుతున్నప్పటికీ నాగచైతన్య మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో “S” అని పెట్టినప్పటినుంచి వీరి విడాకులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసలు నాగ చైతన్య, సమంతల మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..
ఒక సాధారణ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన సమంతకు సినిమాలంటే ఎంతో ఇష్టం. సినిమాలపై ఉన్న ఇష్టతతో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ఈ స్థాయికి చేరుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె ఏమాత్రం సినిమా అవకాశాలను వదులుకోకుండా ఎక్కువగా గ్లామరస్, స్కిన్ షో లను చేయడం అక్కినేని కుటుంబానికి నచ్చలేదు. సినిమాలు వదులుకొని అమల మాదిరిగా ఉండాలని అక్కినేని కుటుంబం సూచించడం తనకి నచ్చలేదు. దీంతో ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా సమంత నటించిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ లో రాజీ పాత్రలో సమంత ఎంతో బోల్డ్ గా నటించింది. ఇలా పెళ్లి తర్వాత సమంత స్కిన్ షో చేయడం నచ్చకపోవడంతో తన పద్ధతి మార్చుకోవాలని నాగచైతన్య సూచించాడు. అప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, ఈ విషయమే వీరి విడాకులకు దారి తీసిందని ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే వీరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో హాజరు అయ్యారని, దీంతో వీరికి కౌన్సెలింగ్ ఇచ్చారని, అయినా కూడా వీరు విడాకులు తీసుకోవాలనే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. విడాకుల తంతు పూర్తయిందని, మరొక రెండు, మూడు నెలలలో విడాకులు రాబోతున్నాయని, సమంతకి నాగచైతన్య తన స్థిర, చరాస్తులు మొత్తం రూ.50 కోట్ల వరకు భరణంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి ఇవే వార్తలు అనేక సైట్లలో వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ వార్తలు హాట్ టాపిక్గా మారాయి.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…