Lord Venkateshwara : కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటారు. తిరుమల కూడా ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని, అంతా శుభమే అని చాలా మంది భావిస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే సంపద కూడా బాగా పెరుగుతుంది. మీ జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయా..? ఆ కష్టాల నుండి గట్టెక్కాలని అనుకుంటున్నారా..? అయితే ఈ విధంగా ముడుపు వేయండి. ఇక మీకు కుబేర కటాక్షమే.
చాలామంది ఏదైనా కష్టం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటుంటారు. ముడుపు కట్టే ముందు, కొన్ని నియమాలుని కచ్చితంగా పాటించాలి. ఇలా కనుక మీరు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు వేస్తే, ఖచ్చితంగా మంచే జరుగుతుంది. సమస్యలన్నీ పోతాయి. ఎంత కష్టమైనా సరే దాని నుండి బయటపడడానికి అవుతుంది. పరిహారం దొరుకుతుంది.
ముడుపు పెట్టడానికి ఒక తెలుపు వస్త్రం తీసుకోండి. పసుపు కలిపినటువంటి నీళ్లలో ముంచి ఆరబెట్టండి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత పసుపు రంగు వస్త్రం కింద అయిపోతుంది. ఆ వస్త్రానికి, నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టాలి. 11 రూపాయలు, 21 కానీ 54 లేదంటే 108 రూపాయలు కానీ అందులో వేయండి. ఇప్పుడు మూట కట్టేసేయండి. మూట కట్టేటప్పుడు మూటకి మూడు ముళ్ళు వేయాలి. మూడు ముళ్ళు వేసేటప్పుడు ఒక్కొక్క ముడి వేస్తూ మీ సమస్యలని చెప్పుకోండి. ఈ ముడి వేసే ముందు ఇంట్లో వినాయకుడి ఫోటో కి ప్రార్థన చేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి.
”ఓం గం గణపతయే నమః” అని 21 సార్లు చెప్పుకొని, వెంకటేశ్వర స్వామికి మీరు ముడుపు కడుతున్నట్లు చెప్పాలి. ఎంతటి కష్టమైనా సరే పోతుంది. మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ముడుపును పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాలు చదువుకోవాలి. అలానే గోవింద నామాలు చదవాలి. పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వాలి, ఇలా ముడుపును కట్టిన తర్వాత మీరు తిరుమల వెళ్లి ముడుపుని హుండీలో వేయాలి. ముడుపులో ఉన్న ధనంతో పాటుగా వడ్డీ కూడా వేయండి. ఇలా కనుక మీరు ముడుపుని చెల్లించారంటే, కచ్చితంగా కష్టమంతా కూడా పోతుంది. అలానే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని వెలిగించండి. సమస్యలన్నీ కూడా పోతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…