Lord Venkateshwara : కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటారు. తిరుమల కూడా ప్రతి ఏటా వెళ్తూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని, అంతా శుభమే అని చాలా మంది భావిస్తారు. వెంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే సంపద కూడా బాగా పెరుగుతుంది. మీ జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయా..? ఆ కష్టాల నుండి గట్టెక్కాలని అనుకుంటున్నారా..? అయితే ఈ విధంగా ముడుపు వేయండి. ఇక మీకు కుబేర కటాక్షమే.
చాలామంది ఏదైనా కష్టం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటుంటారు. ముడుపు కట్టే ముందు, కొన్ని నియమాలుని కచ్చితంగా పాటించాలి. ఇలా కనుక మీరు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు వేస్తే, ఖచ్చితంగా మంచే జరుగుతుంది. సమస్యలన్నీ పోతాయి. ఎంత కష్టమైనా సరే దాని నుండి బయటపడడానికి అవుతుంది. పరిహారం దొరుకుతుంది.
ముడుపు పెట్టడానికి ఒక తెలుపు వస్త్రం తీసుకోండి. పసుపు కలిపినటువంటి నీళ్లలో ముంచి ఆరబెట్టండి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత పసుపు రంగు వస్త్రం కింద అయిపోతుంది. ఆ వస్త్రానికి, నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టాలి. 11 రూపాయలు, 21 కానీ 54 లేదంటే 108 రూపాయలు కానీ అందులో వేయండి. ఇప్పుడు మూట కట్టేసేయండి. మూట కట్టేటప్పుడు మూటకి మూడు ముళ్ళు వేయాలి. మూడు ముళ్ళు వేసేటప్పుడు ఒక్కొక్క ముడి వేస్తూ మీ సమస్యలని చెప్పుకోండి. ఈ ముడి వేసే ముందు ఇంట్లో వినాయకుడి ఫోటో కి ప్రార్థన చేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి.
”ఓం గం గణపతయే నమః” అని 21 సార్లు చెప్పుకొని, వెంకటేశ్వర స్వామికి మీరు ముడుపు కడుతున్నట్లు చెప్పాలి. ఎంతటి కష్టమైనా సరే పోతుంది. మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ముడుపును పూజ మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరాలు చదువుకోవాలి. అలానే గోవింద నామాలు చదవాలి. పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వాలి, ఇలా ముడుపును కట్టిన తర్వాత మీరు తిరుమల వెళ్లి ముడుపుని హుండీలో వేయాలి. ముడుపులో ఉన్న ధనంతో పాటుగా వడ్డీ కూడా వేయండి. ఇలా కనుక మీరు ముడుపుని చెల్లించారంటే, కచ్చితంగా కష్టమంతా కూడా పోతుంది. అలానే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాన్ని వెలిగించండి. సమస్యలన్నీ కూడా పోతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…