వినాయకుడికి అనేక పేర్లు ఉన్న విషయం విదితమే. గణేషుడు, గణనాథుడు, విఘ్నేశ్వరుడు, పార్వతీ తనయుడు.. ఇలా రక రకాల పేర్లతో ఆయనను పిలుస్తారు. అలాగే ఏకదంతుడు అని కూడా అంటారు. మరి వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామా..!
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుడిని దర్శించుకోవాలని కైలాసం వెళ్తాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు. బయట గణేషుడు కాపలాగా ఉంటాడు. అయితే లోపల తన తల్లిదండ్రులు ఏకాంతంలో ఉన్నారని, ఇప్పుడు వారిని దర్శించుకోవడం కుదరదని అక్కడికి వచ్చి పరశురామున్ని గణేషుడు అడ్డగిస్తాడు.
దీంతో పరశురాముడికి, గణేషుడికి మాటా మాటా పెరుగుతుంది. ఇద్దరూ యుద్ధానికి దిగుతారు. గణేషుడు తన తొండంతో పరశురామున్ని ఎత్తి పడేస్తాడు. దీంతో ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలో ఉన్న గండ్ర గొడ్డలిని గణేషుడిపైకి ప్రయోగిస్తాడు. ఈ క్రమంలో వినాయకుడికి ఉండే ఒక దంతం ఊడిపోతుంది. ఆ చప్పుడుకు పార్వతీ పరమేశ్వరులు బయటకు వస్తారు. ఈ క్రమంలో శాంతించిన పరశురాముడు తప్పు జరిగిపోయిందని, క్షమించాలని వేడుకుంటాడు. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ విధంగా ఆ సంఘటన అనంతరం గణేషుడికి ఒకే దంతం ఉంటుంది. అందువల్ల ఆయన ఏక దంతుడు అయ్యాడు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…