Eating With Hand : మనిషి జీవనానికి ఆహారం తీసుకోవడం ఎంతో ఆవశ్యకం. శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి, జీవరసాయన ప్రక్రియలకు, ఆరోగ్యానికి, శక్తికి.. ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకునే ఆహారం వినియోగమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అనుకూలతలు, ఇష్టాలు, స్థోమతలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారాలతో భోజనం చేస్తుంటారు. అయితే ఎవరు ఏం తిన్నా తప్పనిసరిగా కుడి చేత్తోనే తింటారు. ఎడమ చేత్తో ఎవరూ తినరు. ఈ విధానం ఎప్పటి నుంచి ఆచరణలో ఉన్నా.. కుడి చేత్తో తినడం వెనుక మాత్రం.. హిందూ సాంప్రదాయంలో ఆయుర్వేద వైద్యం ప్రకారం కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ కథనం చదవండి.
హిందూ సాంప్రదాయం ప్రకారం కుడి చేతిలో పాజిటివ్ ఎనర్జీ (ధనాత్మక శక్తి) ఉంటుంది. కుడి చేత్తో భోజనం చేయడం వల్ల శరీరానికి, మనసుకు ఈ శక్తి అందుతుంది. కుడిచేతి వేళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుంది. అదేవిధంగా వేళ్ల ఆధారం దగ్గర సరస్వతి, మధ్య భాగంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. కనుక కుడి చేత్తో భోజనం చేయడం వల్ల దైవం ఆశీస్సులు కూడా లభిస్తాయి. యజ్ఞ యాగాలు, దానాలు కూడా కుడి చేత్తోనే చేస్తారు. అదేవిధంగా చేయాలి కూడా. ఎందుకంటే కుడి చేయి ద్వారా ఎంతో విలువైన శక్తి శరీరానికి అందుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం దీన్ని పవిత్రంగా భావిస్తారు.
కుడి చేత్తో తినడమంటే సైతాన్కు దూరంగా ఉండడమే అని కొన్ని మతాలకు చెందిన వారు విశ్వసిస్తారు. ఎడమ చేయి అపరిశుభ్రంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్రతి ఒక్కరూ కుడి చేత్తోనే తింటారు. కుడి చేత్తో తింటే జీర్ణప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. అయితే కొందరు చేతితో కాకుండా స్పూన్తో తింటారు. ఇలా చేయరాదు. అలా చేస్తే ఆహారాన్ని అవమానించినట్లే అవుతుంది. కనుక తప్పనిసరిగా చేత్తోనే ఆహారం తినాలి. ఎడమ చేత్తోనూ స్పూన్ను పట్టుకుని అసలు ఆహారాన్ని తినరాదు. ఇలా నియమాలను పాటించాల్సి ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…