సాధారణంగా చాలా మంది పూజ సమయంలో దైవం వద్ద ఎన్నో రకాల పుష్పాలను సమర్పించి పూజలు చేస్తారు. అయితే చాలా మంది ప్రతి రోజు ఈ పుష్పాలను తొలగించి మరికొన్ని పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. అయితే కొందరు ఒక రోజు దేవుడికి పెట్టిన పువ్వులు వాడిపోయినప్పటికీ అలాగే వదిలేస్తారు. అయితే ఇలా ఎండిపోయిన పువ్వులు దేవుడి దగ్గర ఉండటం మంచిది కాదని ఎన్నో పరిస్థితులకు దారితీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
దేవుడికి సంబంధించిన పువ్వులు వాడిపోయిన తర్వాత వాటిని తీయకుండా అలాగే ఉంచడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని, వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకోసమే ఇంట్లో ఎల్లప్పుడూ కూడా వాడిపోయిన పుష్పాలు ఉండకూడదు. ఇలా వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో కలహాలు, కొట్లాటలు, మానసిక శాంతి, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
అందుకోసమే ప్రతి రోజూ పువ్వులను మనం సమర్పించక పోయినా ఫర్వాలేదు కానీ వాడిపోయిన పుష్పాలను ఇంటిలో ఉంచకూడదు. వాటిని తొలగించినప్పుడే ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి అన్ని శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మన ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుందో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…