సాధారణంగా మనం ఏ ప్రాంతానికి వెళ్లినా మనకు పరమేశ్వరుడి ఆలయాలు కనిపిస్తాయి. ఈ విధంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు భక్తులకు దర్శనం కల్పిస్తున్నాయి. అయితే మనం ఏ ఆలయానికి వెళ్లినా శివుడు లింగ రూపంలో ఒకే రంగులో దర్శనమిస్తూ ఉంటాడు. కానీ మీరు ఎప్పుడైనా చంద్రుడిని అనుసరించి రంగులు మార్చే శివలింగం చూశారా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి చంద్రునితోపాటు రంగులు మార్చే శివలింగం ఎక్కడ ఉంది, అలా మారడానికి గల కారణం ఏమిటి ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం గునుపూడి ప్రాంతంలో శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం పంచారామ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో వెలసిన స్వామి వారిని సాక్షాత్తూ చంద్రుడు ప్రతిష్ఠించాడని ఆలయ పురాణం చెబుతోంది. ఒక శాపం కారణంగా చంద్రుడిని శాపం నుంచి విముక్తి చెందించడం కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించడం వల్ల ఇక్కడ వెలసిన స్వామి వారిని సోమనాథుడు అని కూడా పిలుస్తారు.
ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు చంద్రుడిని అనుసరించి రంగులు మారుతూ భక్తులకు దర్శనమిస్తాడు. పౌర్ణమి రోజు స్వామివారు పూర్తి తెలుపు రంగులో భక్తులకు దర్శనం ఇస్తారు. అమావాస్య రోజు స్వామివారి లింగం ముదురు గోధుమ రంగులోకి మారి దర్శనమిస్తుంది. ఈ వింతను చూడటానికి పౌర్ణమి, అమావాస్య రోజులలో భక్తులు పెద్దఎత్తున ఈ ఆలయానికి వస్తుంటారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…