పంజాబ్లోని పాటియాలా జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ ఏకంగా 8 మంది పురుషులను పెళ్లి పేరిట మోసం చేసింది. అయితే చివరకు పోలీసులు ఆమెను అరెస్టు చేయగలిగారు. కానీ షాకింగ్ విషయం తెలిసింది. ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు నిర్దారించారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయిన పురుషుల పరిస్థితి దారుణంగా మారింది.
పంజాబ్లోని పాటియాలా జిల్లాకు చెందిన ఓ మహిళ (30)కు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను వదిలేశాడు. ఇది నాలుగేళ్ల కిందట జరిగింది. ఈ క్రమంలోనే ఆమె ఎలాగైనా డబ్బు సంపాదించాలని చెప్పి పురుషులను ప్రేమ, పెళ్లి పేరిట మోసం చేయడం ప్రారంభించింది.
గత 4 ఏళ్లుగా ఆమె అలా 8 మంది పురుషులను మోసం చేసింది. ముందుగా ప్రేమిస్తున్నానని చెబుతుంది. పెళ్లి చేసుకుందాం అంటుంది. తీరా పెళ్లయ్యాక 10-15 రోజులు ఉండి కుటుంబ సభ్యులకు మత్తు మందు పెట్టి వారు మత్తులోకి జారుకున్నాక ఇంట్లో ఉన్న నగలు, నగదుతో ఉడాయిస్తుంది. ఈ విధంగా ఆమె 8 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని ఆమె కోసం గాలించారు.
అయితే ఎట్టకేలకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు ఆమెకు సహకరిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను కోర్టులో హాజరు పరిచేముందు వైద్య పరీక్షలు చేయగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ (ఎయిడ్స్) ఉన్నట్లు నిర్దారణ అయింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్న 8 మంది పురుషులకు పోలీసులకు సూచనలు పంపారు. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…