డబ్బు అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం. అందువల్ల డబ్బు విషయంలో పలు నియమాలను పాటించాల్సి ఉంటుంది. డబ్బు పట్ల ఎల్లప్పుడూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరాదు. డబ్బు కింద పడితే వెంటనే తీసి కళ్లకు అద్దుకుని జేబులో లేదా పర్సులో వేసుకోవాలి. అంతేకానీ.. డబ్బు పట్ల అశ్రద్ధను ప్రదర్శించరాదు. లేదంటే అరిష్టం కలుగుతుంది.
ఇక ఇంట్లో చాలా మంది డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. బయటకు వెళ్లి వచ్చాక చేతిలో ఏదైనా చిల్లర మిగిలితే దాన్ని వంట ఇంట్లో లేదా హాల్లో, దిండు కింద.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కొందరు పెడతారు. ఇలా చేయరాదు. చేస్తే లక్ష్మీ దేవి ఆగ్రహిస్తుంది. డబ్బు నష్టం కలుగుతుంది. మరి ఇంట్లో డబ్బును ఎక్కడ పెట్టాలంటే..
ఇంట్లో కుటుంబ పెద్ద ఉపయోగించే మాస్టర్ బెడ్రూమ్లో ఉండే బీరువాలో డబ్బును ఉంచాలి. బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేతిలో ఏదైనా చిల్లర ఉంటే ఆ బీరువాలో పెట్టాలి. అక్కడి నుంచే డబ్బును తీసి వాడాలి. బీరువా లేకపోతే అదే బెడ్ రూమ్లో ఉండే అల్మారాలో డబ్బును ఉంచాలి. అల్మారాకు తలుపులు ఉండేలా చూసుకోవాలి. లేదా పై భాగంలో ఉండే కప్బోర్డులో కూడా డబ్బును పెట్టవచ్చు. నాణేలు, నోట్లు ఏవైనా సరే ఆయా ప్రదేశాల్లోనే ఉంచాలి.
డబ్బును ఎట్టి పరిస్థితిలోనూ వంట గదిలో ఉంచరాదు. చాలా మంది మహిళలు ఇలాగే చేస్తారు. కొందరు దిండు కింద డబ్బును పెడతారు. అలా కూడా చేయరాదు.
ఇక బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ముందుగా మనం ఇంట్లో హాల్ లోకి ప్రవేశిస్తాం కనుక హాల్ లోకి రాగానే కుడి వైపు ఉండే ప్రదేశంలోని ఏదైనా షెల్ప్ లేదా టేబుల్పై ఒక బాక్స్ లాంటిది ఉంచి అందులో కూడా డబ్బును పెట్టుకోవచ్చు. దానికి మూత కచ్చితంగా పెట్టాలి. ఎవరైనా బయటికి వెళ్లి వచ్చినప్పుడు చిల్లర ఉంటే అందులో వేయవచ్చు. లేదా డబ్బును అందులో ఉంచి దాని ద్వారా డబ్బును బయటకు తీసి ఆ డబ్బును ఖర్చు పెట్టాలి. ఈ విధంగా డబ్బు విషయంలో నియమాలను పాటించాలి. దీంతో మనకు డబ్బు మీద శ్రద్ధ ఉందని లక్ష్మీదేవి భావిస్తుంది. మనకు సంపదలను అనుగ్రహిస్తుంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…