మనం ఏదైనా దైవ దర్శనాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొలనులో స్నానాలు ఆచరించి దైవ దర్శనానికి వెళ్తాం. ఈ విధంగా పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొందరు నదికి పూజలు చేస్తుంటారు. మరికొందరు నదిలో దీపాలను వదలడం, కొబ్బరికాయను కొట్టి నదిలోకి వదలడం వంటివి చేస్తుంటారు. మరికొన్ని చోట్ల భక్తులు నదిలోకి లేదా కొలనులోకి కాయిన్స్ వేయడం మనం చూస్తుంటాము. అయితే అందరూ వేస్తున్నారు కాబట్టి మనం వేస్తాం. కానీ ఆ విధంగా కాయిన్స్ ఎందుకు వేస్తారో చాలామందికి తెలియదు.
పూర్వకాలం నుంచే ఈ విధంగా నదిలో నాణేలు వేయడం ఒక ఆచారంగా ఉండేది. అయితే అప్పుడు రాగి నాణేలు ఎక్కువగా వాడుకలో ఉండటం వల్ల ప్రజలు రాగి నాణేలను నీటిలో వేసేవారు. రాగికి నీటిని శుభ్రపరిచే గుణం ఉంది కనుక నదిలోకి రాగి నాణాలు వేయటం వల్ల నీరు శుభ్రం అవుతుంది. ఆ శుభ్రమైన నీరు తాగడానికి ఎంతో ఉపయోగపడుతుందని భావించి కొలనులో వేసేవారు.
అప్పటి నుంచి ఇదే ఆచారం కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం రాగి బదులుగా మనం వాడుకలో ఉన్న కాయిన్స్ వేయటం వల్ల అవి నీటిలో తుప్పుపట్టి నీరు కలుషితం అవుతోంది. ఇప్పుడు వాడుతున్న ఈ కాయిన్స్ ను నీటిలో వేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…