సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివలింగానికి ఎదురుగా నంది మనకు దర్శనమిస్తుంది. ఏ ఆలయంలో కూడా శివలింగానికి ఎదురుగా నంది లేకుండా మనకు శివలింగ దర్శనం ఇవ్వదు. కానీ జ్యోతిర్లింగాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో మాత్రం మనకు శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు. మనదేశంలో నంది లేని శివాలయంగా కాశీ విశ్వేశ్వరాలయం ఉందని చెప్పవచ్చు. అసలు ఈ ఆలయంలో శివునికి ఎదురుగా నంది లేకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు అప్పట్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు అన్నింటిని కూల్చి వేశాడు. ఈక్రమంలోనే ఔరంగజేబు కాశీ విశ్వేశ్వర ఆలయంపై దండెత్తడంతో ఆలయ పూజారి గర్భగుడిలో ఉన్న స్వామివారి లింగాన్ని తీసుకుని పక్కనే ఉన్న బావిలో పడేశాడు. ఈక్రమంలోనే ఔరంగజేబు ఆలయ సగభాగాన్ని కూల్చివేశాడు. అయితే అప్పటికే స్వామివారికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడిని ధ్వంసం చేయకుండా వదిలిపెట్టాడు.
ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని పక్కనే నిర్మించి బావిలో ఉన్న విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అదే రూపంలో ఉన్న మరో లింగాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. ఈ విధంగా కాశీ విశ్వేశ్వర ఆలయంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు లేడు. కానీ పాత ఆలయంలో మాత్రం మనకు నంది దర్శనమిస్తుంది. ఈ విధంగా స్వామివారి లింగాన్ని దర్శనం చేసుకున్న వారు పాత ఆలయానికి వెళ్లి నందీశ్వరుని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా స్వామివారి లింగం బావిలో ఉందని నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఆ బావికి కూడా పూజలు చేస్తారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…