సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివలింగానికి ఎదురుగా నంది మనకు దర్శనమిస్తుంది. ఏ ఆలయంలో కూడా శివలింగానికి ఎదురుగా నంది లేకుండా మనకు శివలింగ దర్శనం ఇవ్వదు. కానీ జ్యోతిర్లింగాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో మాత్రం మనకు శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు. మనదేశంలో నంది లేని శివాలయంగా కాశీ విశ్వేశ్వరాలయం ఉందని చెప్పవచ్చు. అసలు ఈ ఆలయంలో శివునికి ఎదురుగా నంది లేకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు అప్పట్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు అన్నింటిని కూల్చి వేశాడు. ఈక్రమంలోనే ఔరంగజేబు కాశీ విశ్వేశ్వర ఆలయంపై దండెత్తడంతో ఆలయ పూజారి గర్భగుడిలో ఉన్న స్వామివారి లింగాన్ని తీసుకుని పక్కనే ఉన్న బావిలో పడేశాడు. ఈక్రమంలోనే ఔరంగజేబు ఆలయ సగభాగాన్ని కూల్చివేశాడు. అయితే అప్పటికే స్వామివారికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడిని ధ్వంసం చేయకుండా వదిలిపెట్టాడు.
ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని పక్కనే నిర్మించి బావిలో ఉన్న విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో అదే రూపంలో ఉన్న మరో లింగాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. ఈ విధంగా కాశీ విశ్వేశ్వర ఆలయంలో స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు లేడు. కానీ పాత ఆలయంలో మాత్రం మనకు నంది దర్శనమిస్తుంది. ఈ విధంగా స్వామివారి లింగాన్ని దర్శనం చేసుకున్న వారు పాత ఆలయానికి వెళ్లి నందీశ్వరుని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా స్వామివారి లింగం బావిలో ఉందని నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఆ బావికి కూడా పూజలు చేస్తారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…