ప్రధానమంత్రి నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేద మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను పొందారు. ఈ పథకం మొదటి దశ విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల 2.0 పథకం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిరుపేద మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకుని ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ఐదు కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే రెండవ విడతలో భాగంగా 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ల ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఏ విధమైన అర్హతలు ఉండాలి, ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేయాలి ? అనే విషయానికి వస్తే..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి కేవలం 18 సంవత్సరాలు నిండిన మహిళలు మాత్రమే అర్హులు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి రేషన్ కార్డ్ కలిగిన వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే వారి కుటుంబంలో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ లేకపోతేనే ఈ పథకానికి అర్హులు. వలస కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తూ వారు ఏ విధమైన ఆధారాలు ఇవ్వకుండానే గ్యాస్ కనెక్షన్ పొందవచ్చని తెలియజేశారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. ఒకవేళ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే https://pmujjwalayojana.com వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో ఇస్తే సరిపోతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…