ప్రధానమంత్రి నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్, సిలిండర్ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేద మహిళలు ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను పొందారు. ఈ పథకం మొదటి దశ విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల 2.0 పథకం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిరుపేద మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకుని ఉచితంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లను పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువున ఉన్న ఐదు కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే రెండవ విడతలో భాగంగా 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్ల ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఏ విధమైన అర్హతలు ఉండాలి, ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేయాలి ? అనే విషయానికి వస్తే..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి కేవలం 18 సంవత్సరాలు నిండిన మహిళలు మాత్రమే అర్హులు. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి రేషన్ కార్డ్ కలిగిన వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అయితే వారి కుటుంబంలో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ లేకపోతేనే ఈ పథకానికి అర్హులు. వలస కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రకటిస్తూ వారు ఏ విధమైన ఆధారాలు ఇవ్వకుండానే గ్యాస్ కనెక్షన్ పొందవచ్చని తెలియజేశారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. ఒకవేళ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే https://pmujjwalayojana.com వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలో ఇస్తే సరిపోతుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…