హిందువుల పండుగలలో అతి ముఖ్యమైన వాటిలో వినాయకచవితి ఒకటి. వినాయక చవితిని అందరూ ఎంతో వేడుకగా, ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజు ఆ గణనాథుడికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించి, వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తారు. ప్రతి ఏడాది భాద్రపద శుక్ల చతుర్థి సమయంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అసలు వినాయక చవితి జరుపుకోవడానికి కారణం ఏమిటి ? ఈ పండుగ విశిష్టత ఏమిటి ? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం స్వర్గలోకంలో దేవతలందరూ కలిసి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తారు. ఈ క్రమంలోనే దేవతలందరూ పార్వతీ పరమేశ్వరులతో మనం ఏ కార్యం చేసినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజించడానికి ఒక దేవుడిని నియమించండి అంటూ వేడుకుంటారు. అదే సమయంలో అక్కడే ఉన్న పార్వతి తనయులు అందుకు మేము అర్హులమనీ పోటీగా ముందుకొస్తారు. ఈ క్రమంలోనే పరమేశ్వరుడు వారిద్దరికీ ఒక పోటీ పెట్టి ఇందులో ఎవరు విజయం సాధిస్తే వారే అందుకు అర్హులు అని చెబుతారు. మీలో ఎవరైతే లోకంలోని పుణ్యనదులలో స్నానం చేసి వస్తారో వారే ఇందుకు అర్హులని చెప్పడంతో వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిని తీసుకొని ముల్లోకాలలోని నదులను సందర్శించడానికి వెళ్తాడు.
ఈ క్రమంలోనే వినాయకుడు ఇది నాకు ఎలా సాధ్యం అని తన తండ్రిని అడగగా.. అప్పుడు పరమేశ్వరుడు తనకి నారాయణ మంత్రాన్ని జపించమని తెలియజేస్తాడు. ఒక్కసారి ఈ మంత్రాన్ని జపిస్తే మూడు వందల కల్పాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసినట్టవుతుందని తెలియజేయడంతో వినాయకుడు అక్కడే ఉన్న తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నారాయణ మంత్రాన్ని చెప్పుతాడు. ఈ క్రమంలోనే కార్తికేయుడు ముల్లోకాలన్నింటినీ తిరిగి కైలాసం చేరుకునేలోపే అక్కడ వినాయకుడు ఉండడాన్ని చూస్తాడు. దీంతో చింతించి వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని చెబుతాడు. అలా భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గణనాథుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు.
ఈ విధంగా ఎవరైతే ఏదైనా శుభకార్యం తలపెట్టే ముందు వినాయకుడి పూజ చేస్తారో ఆ కార్యంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుందని భావించి వినాయకుడి పూజ చేస్తారు. అలా వినాయక చవితి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు చేసి వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి వినాయకుడి కథ చదువుతూ ఈ పండుగను జరుపుకుంటారు.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…