హిందువుల పండుగలలో అతి ముఖ్యమైన వాటిలో వినాయకచవితి ఒకటి. వినాయక చవితిని అందరూ ఎంతో వేడుకగా, ఘనంగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజు ఆ గణనాథుడికి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించి, వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తారు. ప్రతి ఏడాది భాద్రపద శుక్ల చతుర్థి సమయంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అసలు వినాయక చవితి జరుపుకోవడానికి కారణం ఏమిటి ? ఈ పండుగ విశిష్టత ఏమిటి ? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం స్వర్గలోకంలో దేవతలందరూ కలిసి పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తారు. ఈ క్రమంలోనే దేవతలందరూ పార్వతీ పరమేశ్వరులతో మనం ఏ కార్యం చేసినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజించడానికి ఒక దేవుడిని నియమించండి అంటూ వేడుకుంటారు. అదే సమయంలో అక్కడే ఉన్న పార్వతి తనయులు అందుకు మేము అర్హులమనీ పోటీగా ముందుకొస్తారు. ఈ క్రమంలోనే పరమేశ్వరుడు వారిద్దరికీ ఒక పోటీ పెట్టి ఇందులో ఎవరు విజయం సాధిస్తే వారే అందుకు అర్హులు అని చెబుతారు. మీలో ఎవరైతే లోకంలోని పుణ్యనదులలో స్నానం చేసి వస్తారో వారే ఇందుకు అర్హులని చెప్పడంతో వెంటనే కార్తికేయుడు తన వాహనమైన నెమలిని తీసుకొని ముల్లోకాలలోని నదులను సందర్శించడానికి వెళ్తాడు.
ఈ క్రమంలోనే వినాయకుడు ఇది నాకు ఎలా సాధ్యం అని తన తండ్రిని అడగగా.. అప్పుడు పరమేశ్వరుడు తనకి నారాయణ మంత్రాన్ని జపించమని తెలియజేస్తాడు. ఒక్కసారి ఈ మంత్రాన్ని జపిస్తే మూడు వందల కల్పాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసినట్టవుతుందని తెలియజేయడంతో వినాయకుడు అక్కడే ఉన్న తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నారాయణ మంత్రాన్ని చెప్పుతాడు. ఈ క్రమంలోనే కార్తికేయుడు ముల్లోకాలన్నింటినీ తిరిగి కైలాసం చేరుకునేలోపే అక్కడ వినాయకుడు ఉండడాన్ని చూస్తాడు. దీంతో చింతించి వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని చెబుతాడు. అలా భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గణనాథుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు.
ఈ విధంగా ఎవరైతే ఏదైనా శుభకార్యం తలపెట్టే ముందు వినాయకుడి పూజ చేస్తారో ఆ కార్యంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుందని భావించి వినాయకుడి పూజ చేస్తారు. అలా వినాయక చవితి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు చేసి వివిధ రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి వినాయకుడి కథ చదువుతూ ఈ పండుగను జరుపుకుంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…