Alakshmi : హిందువులు లక్ష్మీ దేవిని ఎంతగా పూజిస్తారో అందరికీ తెలిసిందే. తమకు ధనం సిద్దించాలని, అదృష్టం కలగాలని, ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం కలగాలని ఆమెను వారు ప్రార్థిస్తారు. ఈ క్రమంలో కొందరికి కోరుకున్నట్టుగానే ఐశ్వర్యం కలుగుతుంది. అయితే అది ఓకే.. లక్ష్మీ దేవిని చాలా మంది పూజిస్తారు, ఆమె గురించి అందరికీ తెలుసు. కానీ ఆమె అక్క గురించి మీకు తెలుసా..? అవును, ఆవిడ కూడా ఉంది. ఆమె పేరు అలక్ష్మి. అయితే శ్రీమహావిష్ణువు ఆమెకు పెళ్లి చేసేందుకు నానా కష్టాలు పడ్డాడట. ఇంతకీ అసలు కథ ఏమిటంటే..
దేవతలు, రాక్షసులు ఆదిశేషువును తాడుగా చేసుకుని, మందర పర్వత్వాన్ని కవ్వంగా చేసుకుని క్షీరసాగరాన్ని మధిస్తారు. అప్పుడు దాంట్లో నుంచి అనేక వస్తువులు మాత్రమే కాదు, దేవతలు కూడా ఉద్భవిస్తారు. వారిలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది. దీంతో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తాడు. అయితే లక్ష్మీదేవి అందుకు నిరాకరిస్తుంది. కారణం అడగ్గా.. తన కన్నా ముందు పెళ్లి కాని అక్క ఉందని ఆమెకు పెళ్లి అయితేనే తాను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. దీంతో విష్ణువు లక్ష్మీదేవి అక్క అయిన అలక్ష్మికి పెళ్లి సంబంధాలు చూస్తాడు. అయితే ఎవ్వరూ ఆమెను పెళ్లి చేసుకోరు. అవును, ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం నిలవదట. ధనం ఆగదట. పోతూనే ఉంటుందట. మరి అలాంటప్పుడు తెలిసి తెలిసి ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి.
అయితే వెతగ్గా వెతగ్గా అలక్ష్మికి ఓ వరుడు దొరుకుతాడు. అతను ఉద్దాలకుడు. ఆయన ఓ మహాముని. ఆయన అలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. దీంతో కథ సుఖాంతం అవుతుంది. ఆ తరువాత లక్ష్మీ దేవి విష్ణువును పరిణయమాడుతుంది. అయితే ఉద్దాలకుడితో వెళ్లిన అలక్ష్మి ఆయన ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం వద్దే ఆగుతుంది. ఎందుకని అడగ్గా, తాను శుభ్రంగా ఇంట్లో ఉండనని, మురికిగా, అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉంటానని, దుస్తులు కూడా అలాగే ఉండాలని చెబుతుంది. అంటే.. ఏ ఇంట్లో అయితే మురికిగా, అశుభ్రంగా ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉంటుందట. అంటే.. ఆ ఇంట్లో డబ్బు నిలవదని మనకు తెలుస్తుంది. అందుకే ఎవరైనా తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన దుస్తులను వేసుకోవాలి. అప్పుడే లక్ష్మి నిలుస్తుంది.
అంతేకాదు.. ఇళ్ల గుమ్మాల్లో మిరపకాయలు, నిమ్మకాలను గుత్తిగా వేలాడదీసి గుమ్మాలకు కడతారు కదా..! అది కూడా అలక్ష్మి కోసమేనట. ఇంటి వద్దకు వచ్చిన అలక్ష్మికి ఆ ఆహారం అంటే ఇష్టమట. పుల్లగా, వగరుగా, కారంగా ఉండే ఆహారం అంటే ఆమె ఇష్టపడుతుందట. అందుకనే వాటిని గుమ్మాల వద్ద వేలాడదీస్తారు. ఈ క్రమంలో ఒక వేళ అలక్ష్మి వస్తే వాటిని తిని ఇక ఆ ఇంట్లోకి వెళ్లకుండా బయటికి పోతుందని అందరూ నమ్ముతారు. అందుకే ఆ వస్తువులను చాలా మంది ఇళ్లు మాత్రమే కాదు, ఆఫీసులు, షాపుల్లోనూ బయట వేలాడదీస్తారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…