Lord Shiva : శివుడిని ఆరాధించేటప్పుడు శివుడికి ఇష్టమైన ఉమ్మెత్త పూలతో చాలామంది పూజ చేస్తూ ఉంటారు. ఉమ్మెత్త పువ్వులను శివుడికి పెడితే ఎంతో మంచి జరుగుతుంది. భక్తులకి మోక్షం కలుగుతుంది. కేరళలోని శివాలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో, అభిషేకం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. మాంగల్యబలం లభించడానికి ఉమ్మెత్త పువ్వులతో శివుడిని ఆరాధిస్తే మంచిది. ఉమ్మెత్త పూలతో మాల కట్టి శివుడికి పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయి.
వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులు ఇష్టం. వినాయకుడికి కూడా పెట్టవచ్చు. దుర్గాదేవికి కూడా ఉమ్మెత్త పువ్వులని పెట్టవచ్చు. దరిద్రం పోతుంది. నవరాత్రి రోజుల్లో ఏడవ రోజు సరస్వతీ దేవికి ఉమ్మెత్త పువ్వులని పెట్టి అలంకరిస్తారు. ఉమ్మెత్త పువ్వులతో సరస్వతీ దేవిని పూజించడం వలన చక్కటి ఫలితాలు కనబడతాయి. ప్రదోషకాలంలో శివుడికి ఉమ్మెత్త పువ్వులను పెట్టడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. సర్ప దోషంతో బాధపడేవాళ్లు శివుడికి ఉమ్మెత్త పువ్వులని పెడితే ఆ దోషం నుండి బయటకు రావచ్చు.
అమావాస్యకి, పౌర్ణమికి ఒక్కరోజు ముందు ఈ ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని అంటారు. ఈ సమయంలో కనుక శివుడిని దర్శించుకుంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రదోషం రోజున సాయంత్రం నాలుగు నుండి 6 వరకు నందీశ్వరుడిని పూజిస్తే మంచిది. శివుడు అభిషేక ప్రియుడు. ఆ రోజు పాలాభిషేకం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.
కొబ్బరినీళ్లు, బిల్వపత్రాలు కూడా అభిషేకాన్ని చేయడానికి వాడవచ్చు. అలా చేయడం వలన ఈతి బాధలు పోతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి అర్చన చేస్తే సమస్త దోషాలు కూడా పోతాయి. ఏడు జన్మల పాపాలు కూడా పోతాయి. శివుడికి మామిడిపండ్ల రసంతో అభిషేకం చేస్తే ధన ధాన్యాలు కలుగుతాయి. జీవితంలో ధన ధాన్యాలకు లోటే ఉండదు. ఆర్థిక బాధలు, ఈతి బాధలు కూడా పోతాయి. ఈసారి వీటిని గుర్తు పెట్టుకుని శివుడిని ఈ విధంగా ఆరాధిస్తే కచ్చితంగా అంతా మంచే జరుగుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…