Lord Shiva : శివుడిని ఆరాధించేటప్పుడు శివుడికి ఇష్టమైన ఉమ్మెత్త పూలతో చాలామంది పూజ చేస్తూ ఉంటారు. ఉమ్మెత్త పువ్వులను శివుడికి పెడితే ఎంతో మంచి జరుగుతుంది. భక్తులకి మోక్షం కలుగుతుంది. కేరళలోని శివాలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో, అభిషేకం ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. మాంగల్యబలం లభించడానికి ఉమ్మెత్త పువ్వులతో శివుడిని ఆరాధిస్తే మంచిది. ఉమ్మెత్త పూలతో మాల కట్టి శివుడికి పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయి.
వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులు ఇష్టం. వినాయకుడికి కూడా పెట్టవచ్చు. దుర్గాదేవికి కూడా ఉమ్మెత్త పువ్వులని పెట్టవచ్చు. దరిద్రం పోతుంది. నవరాత్రి రోజుల్లో ఏడవ రోజు సరస్వతీ దేవికి ఉమ్మెత్త పువ్వులని పెట్టి అలంకరిస్తారు. ఉమ్మెత్త పువ్వులతో సరస్వతీ దేవిని పూజించడం వలన చక్కటి ఫలితాలు కనబడతాయి. ప్రదోషకాలంలో శివుడికి ఉమ్మెత్త పువ్వులను పెట్టడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. సర్ప దోషంతో బాధపడేవాళ్లు శివుడికి ఉమ్మెత్త పువ్వులని పెడితే ఆ దోషం నుండి బయటకు రావచ్చు.
అమావాస్యకి, పౌర్ణమికి ఒక్కరోజు ముందు ఈ ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని అంటారు. ఈ సమయంలో కనుక శివుడిని దర్శించుకుంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది. ప్రదోషం రోజున సాయంత్రం నాలుగు నుండి 6 వరకు నందీశ్వరుడిని పూజిస్తే మంచిది. శివుడు అభిషేక ప్రియుడు. ఆ రోజు పాలాభిషేకం చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.
కొబ్బరినీళ్లు, బిల్వపత్రాలు కూడా అభిషేకాన్ని చేయడానికి వాడవచ్చు. అలా చేయడం వలన ఈతి బాధలు పోతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి అర్చన చేస్తే సమస్త దోషాలు కూడా పోతాయి. ఏడు జన్మల పాపాలు కూడా పోతాయి. శివుడికి మామిడిపండ్ల రసంతో అభిషేకం చేస్తే ధన ధాన్యాలు కలుగుతాయి. జీవితంలో ధన ధాన్యాలకు లోటే ఉండదు. ఆర్థిక బాధలు, ఈతి బాధలు కూడా పోతాయి. ఈసారి వీటిని గుర్తు పెట్టుకుని శివుడిని ఈ విధంగా ఆరాధిస్తే కచ్చితంగా అంతా మంచే జరుగుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…