Lakshmi Devi : కొంతమంది చేతుల్లో డబ్బు అసలు నిలవదు. చాలామంది విపరీతమైన ఖర్చు వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బులని పొదుపుగా ఖర్చు చేయకుండా, డబ్బు అంతా ఖర్చు అయిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. అయితే చేతిలో డబ్బులు నిలవాలంటే ఇలా చేయండి. ఇలా చేస్తే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండవచ్చు.
లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాలలో, ఇతిహాసాలలో ఉన్నాయి. మహావిష్ణువుకి లక్ష్మీ తోడుగానే ఉందని, లక్ష్మీనారాయణలు వేరు వేరు కాదని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్పడం జరిగింది. మహాశక్తి సృష్టిని పాలించడానికి, విష్ణువుకి తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని, దేవీ భాగవతంలో ఉంది. లక్ష్మీ, విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడు అయ్యాడని, అప్పుడు బ్రహ్మ ఆనతి పై భృగు మహర్షి తపస్సు చేయగా, లక్ష్మీ భృగువు ఖ్యాతిల కూతురుగా లక్ష్మీ పుట్టిందని అంటారు. భృగువు విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అందుకని లక్ష్మిని భార్గవి అని అంటారు.
వేదాలలో కూడా లక్ష్మీదేవి గురించి చెప్పడం జరిగింది. యజుర్వేదంలో, మత్స్య పురాణంలో, అగ్ని పురాణంలో కూడా అమ్మవారు గురించి ఉంది. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి ఏం చేయాలి అనే విషయాన్ని చూస్తే.. పూజ గదిలో నేతితో దీపారాధన చేసి, అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా పెట్టి, తొమ్మిది శుక్రవారములు ఇలా లక్ష్మీదేవిని ఆరాధిస్తే, చాలా మంచి జరుగుతుందట. మహాలక్ష్మి దేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది. శుక్రవారం సాయంత్రం మహాలక్ష్మి దేవికి ఉసిరికాయ దీపాలని వెలిగిస్తే, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనకధార స్తోత్రం పఠించిన తర్వాత, ఉసిరికాయ బొబ్బట్లు లేదా గుజ్జును మహాలక్ష్మి దేవికి నైవేద్యం పెడితే, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు.
ఉసిరి దీపంతో మహాలక్ష్మి దేవికి హారతి ఇస్తే, దరిద్రం పోతుంది. ఉసిరికాయ దీపాన్ని మహాలక్ష్మి దేవికి పెట్టడం వలన అప్పుల బాధ నుండి బయటపడొచ్చు. ఉసిరి గుజ్జు, ఉసిరికాయ పచ్చడి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి, తర్వాత ముత్తైదువులకి వాయనం ఇస్తే, మొండి బకాయిలు వసూలు అవుతాయి. శ్రీ చక్రానికి ఉసిరికాయని నైవేద్యంగా పెడితే, సిరిసంపదలు కలుగుతాయి. ఉసిరి చెట్టుకి ప్రతిరోజు పూజ చేసి నీళ్లు పోసి నమస్కరించుకుంటే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఉసిరికాయని కాలితో తొక్కితే దరిద్రం అనుభవిస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…