Meals : మన పురాణాల్లో ఎన్నో విషయాల గురించి చెప్పబడింది. వాటిని ఇప్పటికీ చాలా మంది పాటిస్తున్నారు. పూర్వకాలం నుండి పెద్దలు పాటిస్తున్న ఆచారాలను కూడా చాలా మంది ఇంకా ఇళ్లల్లో పాటిస్తున్నారు. అయితే శాస్త్రాల ప్రకారం ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఇటువంటి ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది కాదు. తీసుకునే భోజనం సరిగా లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే దేవుడితో సమానం. కనుక వృథా చేయకూడదు.
శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే భోజనం చేసే సమయంలో ఎవరూ కూడా భోజనం చేసే ప్లేట్ నుండి దాటకూడదు. పొరపాటున కూడా అలా దాటిన ఆహారాన్ని తినకూడదు. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే పాపం చుట్టుకుంటుంది. బల్లి లేదా ఇతర కీటకాలు ఏమైనా ఆహార పదార్థాలలో పడితే అటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం దరిద్రం చుట్టుకుంటుంది. మనలో చాలామంది ఏదో ఒకసారి గొడవ పడుతూనే ఉంటారు. అయితే ఏదైనా గొడవ జరిగినప్పుడు భోజనం చేయాలని అనిపించదు. అలాంటప్పుడు భోజనం చేయకుండా ఉండటమే మంచిది.
అలాంటి సమయంలో భోజనం చేస్తే జీర్ణ క్రియ చెడిపోతుంది. తినేటప్పుడు ఎప్పుడు కూడా మనసుపెట్టి తినాలి. లేదంటే తినడం మానేయాలి. పాకశాస్త్రం ప్రకారం భోజనంలో వెంట్రుకలు కనుక వచ్చినట్లయితే ఇంట్లో రోగాలు ఎక్కువవుతాయి. అయితే అలా వెంట్రుకలు పడిన ఆహారాన్ని తీసుకోవడం కంటే కూడా జంతువులకు పెట్టడం మంచిది.
పొరపాటున ఎవరైనా తినే ఆహారంలో ఉమ్మివేసినా, ఉమ్మిపడినా ఆ భోజనం తినకూడదు. అలాంటి ఆహారం తింటే బలహీనత కలుగుతుంది. భోజనం చేసేటప్పుడు దగ్గరలో శునకాలు ఉంటే వాటికి భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా ఆహారం మీరు తిన్నట్లయితే ఆయుష్షు తగ్గుతుంది. చూశారు కదా.. ఎలాంటి పొరపాట్లు చేయకూడదో. ఈసారి ఇలాంటి పొరపాట్లు చేయకుండా చూసుకోండి.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…