కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం అని అందరికీ తెలిసిందే. ఈ మాసంలో శివారాధన చేస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలం లభిస్తుంది. అలాగే మహాశివరాత్రి రోజు శివుడికి పూజలు చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే శివారాధనలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కొందరు భక్తులు ప్రతి సోమవారం దీపారాధన చేస్తారు. ఇక కేవలం శివుడికే కాకుండా ఇతర దేవతలకు కూడా కొందరు వారం వారం దీపారాధన చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు కొందరు తెలియకుండానే పొరపాట్లు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ కుందులో దీపారాధన చేయరాదు. ఇతర పదార్థాలతో చేసిన కుందులనే దీపారాధనకు ఉపయోగించాలి. మట్టితో చేసినవి అయితే ఇంకా శ్రేష్టమైనవి. అలాగే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. అదేవిధంగా ఒక వత్తితో దీపాన్ని చేయరాదు. ఏకవత్తి దీపాన్ని శవం వద్ద వెలిగిస్తారు. కనుక ఈ పొరపాటు అసలు చేయరాదు. ఇక దీపాన్ని అగర్ బత్తితో వెలిగించాల్సి ఉంటుంది.
దీపారాధన చేసే సమయంలో కుందుకి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. అలాగే విష్ణువుకు అయితే కుడి వైపు దీపాన్ని ఉంచాలి. ఎదురుగా దీపాన్ని పెట్టరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించి ఆ తరువాతే దీపం వెలిగించాలి. ఇలా దీపారాధనలో ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. లేదంటే దీపారాధన చేసిన ఫలితం కూడా రాదు. కాబట్టి తప్పకుండా ఈ నియమాలను గుర్తుంచుకుని మరీ పాటించాల్సి ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…