కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం అని అందరికీ తెలిసిందే. ఈ మాసంలో శివారాధన చేస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలం లభిస్తుంది. అలాగే మహాశివరాత్రి రోజు శివుడికి పూజలు చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. అయితే శివారాధనలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కొందరు భక్తులు ప్రతి సోమవారం దీపారాధన చేస్తారు. ఇక కేవలం శివుడికే కాకుండా ఇతర దేవతలకు కూడా కొందరు వారం వారం దీపారాధన చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు కొందరు తెలియకుండానే పొరపాట్లు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ కుందులో దీపారాధన చేయరాదు. ఇతర పదార్థాలతో చేసిన కుందులనే దీపారాధనకు ఉపయోగించాలి. మట్టితో చేసినవి అయితే ఇంకా శ్రేష్టమైనవి. అలాగే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. అదేవిధంగా ఒక వత్తితో దీపాన్ని చేయరాదు. ఏకవత్తి దీపాన్ని శవం వద్ద వెలిగిస్తారు. కనుక ఈ పొరపాటు అసలు చేయరాదు. ఇక దీపాన్ని అగర్ బత్తితో వెలిగించాల్సి ఉంటుంది.
దీపారాధన చేసే సమయంలో కుందుకి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. అలాగే విష్ణువుకు అయితే కుడి వైపు దీపాన్ని ఉంచాలి. ఎదురుగా దీపాన్ని పెట్టరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించి ఆ తరువాతే దీపం వెలిగించాలి. ఇలా దీపారాధనలో ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. లేదంటే దీపారాధన చేసిన ఫలితం కూడా రాదు. కాబట్టి తప్పకుండా ఈ నియమాలను గుర్తుంచుకుని మరీ పాటించాల్సి ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…