Lord Surya : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ, కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే, ఇలా చేయడం మంచిది. ఇలా చేస్తే, ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు, ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించడం చాలా మంచిది. జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లు, సూర్యుడిని ఆరాధించాలి. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు, ఆదివారం నాడు సూర్యుడిని పూజిస్తే, మంచి ఫలితాలు ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నవగ్రహాల్లో సూర్యుడిని అధిపతిగా, రాజుగా పరిగణించడం జరుగుతుంది. మొత్తం 12 రాశి చక్రాలలో సూర్యుడు సింహరాశిని పాలిస్తాడు. సూర్యుడు మేషరాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. తులారాశిలో బలహీనమవుతాడు. సూర్యుడిని ఆరాధించడం వలన, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జీవితంలో ఆనందంగా ఉండడానికి అవుతుంది.
కష్టపడి పనిచేసినా కూడా కొంతమందికి ఫలితాలు రావు. అటువంటి వాళ్ళకి సూర్యుడు బలహీన స్థానంలో ఉంటారు. సూర్యుడు బలహీనంగా ఉండడం వలన, ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువవుతుంది. హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవడం వలన, సూర్య భగవానున్ని ప్రసన్నం చేసుకోవచ్చు. పారాయణం చేసి, సూర్యుడని ఆరాధించడం వలన, సూర్య భగవానుడు ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్లు, ఆదివారం రోజు రాగి పాత్రలు లేదంటే గోధుమలు దానం చేయడం మంచిది.
ఆదివారం రోజు సాయంత్రం, సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర, నాలుగు ముఖాలు కలిగిన దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా, ఆదివారం నాడు స్నానం చేసే నీటిలో, ఎర్రటి పూలు వేసుకొని స్నానం చేయాలి. ఎర్రచందనం, యాలకులు, కుంకుమపువ్వు వంటివి వేసుకుని స్నానం చేయడం వలన, సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. శనివారం నిద్రపోవడానికి ముందు తలపై ఆవుపాల సీసా పెట్టుకోవాలి. ఉదయాన్నే, తలస్నానం చేసి పూజ చేశాక, ఈ పాలని కూడా పూజించి, తర్వాత తీసుకోవాలి. ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…