Lakshmi Devi : శుక్రవారం నాడు ఇది చేయకూడదు. అది చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ, చాలామందికి, క్లియర్ గా ఈ విషయాలు తెలియవు. శుక్రవారం నాడు, మరి ఏఏ పనులు చేయొచ్చు..? ఏఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడే తెలుసుకుందాం. శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజిస్తే, చాలా మంచి జరుగుతుంది. మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలని, దుర్గా దేవికి శుక్రవారం సమర్పిస్తే, ఈతి బాధలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకుంటే, తులసిమాల వేయండి.
ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు, వెన్న ముద్దతో ఆలయానికి వెళ్ళండి. అప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇతరుల అగ్గిపెట్టి తీసుకుని కానీ దీపాన్ని తీసుకుని కానీ వెలిగించడం మంచిది కాదు. ఈ పుణ్యఫలం మీకు దక్కకుండా, ఇతరులకి దక్కుతుంది. శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తే, గరిక మాల తీసుకువెళ్లాలి.
గరిక మాల అంటే, వినాయకుడికి ఎంతో ఇష్టం. శుక్రవారంనాడు శివాలయానికి వెళ్తే, బిల్వపత్రాలను తీసుకువెళ్లండి. కష్టాలు తొలగిపోతాయి. సర్వ శుభాలు కలుగుతాయి. నుదుట కుంకుమ బొట్టు కచ్చితంగా పెట్టుకోవాలి. పసుపు, కుంకుమలని నుదుట కుంకుమ కింద విభూతిని మొదట బొట్టు పైన పెట్టుకోవాలి. శుక్రవారం ఉదయం తలస్నానం చేసి, పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవాలి.
ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, అమ్మవారిని దర్శించుకోవాలి. నేతితో దీపం పెడితే, సుమంగళి ప్రాప్తిస్తుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. అలానే, శుక్రవారంనాడు పాలతో చేసిన పాయసం తాగితే, ఆరోగ్యానికి మంచిది. మహిళలు తెల్లటి పువ్వులని, తలలో పెట్టుకోవడం వలన, శుభ ఫలితం ఉంటుంది. ఇలా, శుక్రవారంనాడు వీటిని ఆచరించినట్లయితే, మంచి జరుగుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…