Deeparadhana : హిందూ సాంప్రదాయంలో దేవుళ్లను పూజించే పద్ధతుల్లో అనేక విధానాలున్నాయి. పూవులను వాడడం, అగరుబత్తీలు వెలిగించడం, ధూపం, దీపం.. ఇలా అనేక మంది తమ అనుకూలతలను బట్టి దేవుళ్లను పూజిస్తారు. అయితే ఎవరు దేవున్ని పూజించినా దీపారాధన చేయకుండా పూజనైతే ముగించరు. ఎందుకంటే దీపంలో ఉండే వెలుగు దైవానికి చిహ్నం కాబట్టి. దీపంతో దేవున్ని ఆరాధిస్తే శాంతి కలుగుతుంది. శుభం చేకూరుతుంది. అందుకే చాలా మంది దీపారాధన విషయంలో శ్రద్ధను కనబరుస్తారు కూడా.
అయితే సాధారణంగా ఎవరు దీపారాధన చేసినా దీపంలో వత్తులను ఒక సంఖ్య ప్రకారం పెట్టి ఆరాధిస్తారు. కానీ అలా కాకుండా భక్తులు తాము పుట్టిన తేదీలకు అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో వత్తులతో దీపారాధన చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం కలుగుతుందట. అన్నీ శుభాలే చేకూరుతాయట. ఈ క్రమంలో జన్మతేదీలకు అనుగుణంగా ఏయే తేదీల్లో పుట్టిన వారు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 తేదీల మధ్య జన్మించిన వారు 5 వత్తులతో దీపారాధాన చేయాలి. ఏప్రిల్ 21 నుంచి మే 20 మధ్య పుట్టిన వారు 7 వత్తులతో దీపం వెలిగించాలి. మే 21 నుంచి జూన్ 20 మధ్య పుట్టిన వారు 6 వత్తులతో దీపం వెలిగిస్తే మంచిది. జూన్ 21 నుంచి జూలై 20 మధ్య జన్మించిన వారు 5 వత్తులతో దీపం వెలిగించాలి. జూలై 21 నుంచి ఆగస్టు 20 మధ్య పుట్టిన వారు 3 వత్తులతో దీపారాధన చేయాలి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య పుట్టిన వారు 6 వత్తులతో దీపం వెలిగించాలి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 మధ్య పుట్టిన వారు 7 వత్తులతో దీపారాధాన చేయాలి.
అక్టోబర్ 21 నుంచి నవంబర్ 20 మధ్య జన్మించిన వారు 2 వత్తులతో దీపం వెలిగించాలి. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 20 మధ్య పుట్టిన వారైతే 5 వత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 20 మధ్య వారైతే 6 వత్తులతో దీపం వెలిగించాలి. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య పుట్టిన వారు 6 వత్తులతో దీపం వెలిగించాలి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 20 మధ్య జన్మించిన వారు 2 వత్తులతో దీపారాధన చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దేవుళ్లకు దీపారాధన చేస్తే దాంతో ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. దీని వల్ల భక్తులకు అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…