మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని మనం పాటిస్తున్నాం. కానీ వాటి వెనుక కారణాలు మనకి తెలియదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఆ ఏడాది అంతా పూజలు చేయరు. అలానే పండుగలు కూడా జరుపుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే, పూజలు ఏడాది మొత్తం చేసుకోకూడదా.. ఈ సందేహం చాలా మందిలో ఉంది. మీకు కూడా ఈ సందేహం ఉంటే, ఇప్పుడే ఈ విషయాలను తెలుసుకోండి. కొంతమంది ఇళ్లల్లో అయితే ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం అంతా కూడా ఏ పూజలు చేయరు.
ఎటువంటి పండగలు కూడా జరపరు. ఇంకొందరైతే ఏడాది మొత్తం దేవుడి గుడికి వెళ్ళరు. అలానే దేవుడి గది తలుపులు కూడా మూసేసి ఉంచుతారు. ఇంట్లో పూజలు, శుభకార్యాలు కానీ పండగలు కానీ, దీపారాధన చేయడం, నైవేద్యం పెట్టడం ఇవేమీ ఉండవు. అయితే ఎవరైనా చనిపోతే దీపారాధన చేయడం మానక్కర్లేదు. ఎందుకంటే దీపారాధన చెయ్యని ఇల్లు శ్మశానంతో సమానం. ఎప్పుడూ కూడా దీపారాధన జరిగే చోటికి దేవుళ్ళు వస్తూ ఉంటారు.
అందుకే ప్రతిరోజు కూడా దీపం పెట్టాలి. అప్పుడే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో, సౌభాగ్యాలతో ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చనిపోతే, దహన సంస్కారాలు ముగిసిన తర్వాత 11 రోజులు పాటు దీపారాధన చేయడం శుభకార్యాలు చేసుకోవడం పూజలు చేయడం వంటివి చేయకూడదు. 11 రోజులు మాత్రమే ఇలా పాటించాలి. తర్వాత 12వ రోజు నుండి శుభస్వీకారం జరుగుతుంది. 11 రోజుల తర్వాత కచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. అయితే సంవత్సరం పొడవునా ఎక్కడికీ వెళ్ళకూడదని, గుడిలో పూజలు చేయకూడదని, ఇళ్ళల్లో పూజలు చేయకూడదని ఏమీ లేదు.
దీపారాధన చేసుకోవచ్చు. చెయ్యాలి. నిత్యం దీపారాధన చేయడం వలన ఇంట్లో దేవతలు తిష్ట వేసుకుని కూర్చుంటారు. దీప, ధూప నైవేద్యాలు లేకుండా పూజ గదిని అలా వదిలేయడం, తలుపులు మూసేసి ఉంచడం వంటివి చేయడం తప్పు. అలాంటి ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. దోషాలు కూడా తగులుతాయి. కాబట్టి కచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే దీపారాధన చేయడం మానేయకండి. ఇంట్లో ఏడాది లోపే శుభకార్యాలు కూడా చేయాలని శాస్త్రాలు, పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…