మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని మనం పాటిస్తున్నాం. కానీ వాటి వెనుక కారణాలు మనకి తెలియదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఆ ఏడాది అంతా పూజలు చేయరు. అలానే పండుగలు కూడా జరుపుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే, పూజలు ఏడాది మొత్తం చేసుకోకూడదా.. ఈ సందేహం చాలా మందిలో ఉంది. మీకు కూడా ఈ సందేహం ఉంటే, ఇప్పుడే ఈ విషయాలను తెలుసుకోండి. కొంతమంది ఇళ్లల్లో అయితే ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం అంతా కూడా ఏ పూజలు చేయరు.
ఎటువంటి పండగలు కూడా జరపరు. ఇంకొందరైతే ఏడాది మొత్తం దేవుడి గుడికి వెళ్ళరు. అలానే దేవుడి గది తలుపులు కూడా మూసేసి ఉంచుతారు. ఇంట్లో పూజలు, శుభకార్యాలు కానీ పండగలు కానీ, దీపారాధన చేయడం, నైవేద్యం పెట్టడం ఇవేమీ ఉండవు. అయితే ఎవరైనా చనిపోతే దీపారాధన చేయడం మానక్కర్లేదు. ఎందుకంటే దీపారాధన చెయ్యని ఇల్లు శ్మశానంతో సమానం. ఎప్పుడూ కూడా దీపారాధన జరిగే చోటికి దేవుళ్ళు వస్తూ ఉంటారు.
అందుకే ప్రతిరోజు కూడా దీపం పెట్టాలి. అప్పుడే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో, సౌభాగ్యాలతో ఉంటుంది. ఇంట్లో ఎవరైనా చనిపోతే, దహన సంస్కారాలు ముగిసిన తర్వాత 11 రోజులు పాటు దీపారాధన చేయడం శుభకార్యాలు చేసుకోవడం పూజలు చేయడం వంటివి చేయకూడదు. 11 రోజులు మాత్రమే ఇలా పాటించాలి. తర్వాత 12వ రోజు నుండి శుభస్వీకారం జరుగుతుంది. 11 రోజుల తర్వాత కచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. అయితే సంవత్సరం పొడవునా ఎక్కడికీ వెళ్ళకూడదని, గుడిలో పూజలు చేయకూడదని, ఇళ్ళల్లో పూజలు చేయకూడదని ఏమీ లేదు.
దీపారాధన చేసుకోవచ్చు. చెయ్యాలి. నిత్యం దీపారాధన చేయడం వలన ఇంట్లో దేవతలు తిష్ట వేసుకుని కూర్చుంటారు. దీప, ధూప నైవేద్యాలు లేకుండా పూజ గదిని అలా వదిలేయడం, తలుపులు మూసేసి ఉంచడం వంటివి చేయడం తప్పు. అలాంటి ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. దోషాలు కూడా తగులుతాయి. కాబట్టి కచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే దీపారాధన చేయడం మానేయకండి. ఇంట్లో ఏడాది లోపే శుభకార్యాలు కూడా చేయాలని శాస్త్రాలు, పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…