తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం రేపిన సంగతి మనకు తెలిసిందే. కేవలం కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంగా అమృత తల్లిదండ్రులు నడిరోడ్డుపై అతి దారుణంగా చంపిన ఘటన ఇప్పటికీ అందరి కళ్ల ముందు కదులుతోంది. ఇదిలా ఉండగానే ఉత్తరప్రదేశ్లో మరో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న కారణంతోనే వధువు తల్లిదండ్రులు వరుడిని అతి కిరాతకంగా చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
గోరఖ్పూర్కు చెందిన అనీష్ కుమార్ చౌదరి, దీప్తి మిశ్రా అనే యువతి యువకులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లి విషయం పెద్దల ముందు తెలపడంతో దీప్తి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే అనీష్ దీప్తి తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.దీంతో తమ ఇంటి పరువు పోయిందని భావించిన దీప్తి కుటుంబ సభ్యులు పెళ్లి జరిగిన మూడు నెలల వరకు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్లాన్ ప్రకారమే కొద్ది రోజుల క్రితం నడిరోడ్డుపై వెళ్తున్న అటువంటి అనీష్ కుమార్ ను దీప్తి తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. తన భర్త చావుకు కారణం తన తల్లిదండ్రులేనని దీప్తి చేసిన ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనీష్, దీప్తి ఇద్దరు ఉన్నత చదువులు చదివి ఇద్దరు గ్రామపంచాయతీ అధికారులుగా ప్రభుత్వ కొలువులను సాధించారు. ఇద్దరూ ఒకే చోట పని చేయటం వల్ల వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్న వీరి జీవితంలో ఇలాంటి ఘటన ఎదురైందని దీప్తి కన్నీరుమున్నీరయ్యారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…