తెలంగాణ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం రేపిన సంగతి మనకు తెలిసిందే. కేవలం కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంగా అమృత తల్లిదండ్రులు నడిరోడ్డుపై అతి దారుణంగా చంపిన ఘటన ఇప్పటికీ అందరి కళ్ల ముందు కదులుతోంది. ఇదిలా ఉండగానే ఉత్తరప్రదేశ్లో మరో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న కారణంతోనే వధువు తల్లిదండ్రులు వరుడిని అతి కిరాతకంగా చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
గోరఖ్పూర్కు చెందిన అనీష్ కుమార్ చౌదరి, దీప్తి మిశ్రా అనే యువతి యువకులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లి విషయం పెద్దల ముందు తెలపడంతో దీప్తి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే అనీష్ దీప్తి తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.దీంతో తమ ఇంటి పరువు పోయిందని భావించిన దీప్తి కుటుంబ సభ్యులు పెళ్లి జరిగిన మూడు నెలల వరకు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డారు.
ప్లాన్ ప్రకారమే కొద్ది రోజుల క్రితం నడిరోడ్డుపై వెళ్తున్న అటువంటి అనీష్ కుమార్ ను దీప్తి తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. తన భర్త చావుకు కారణం తన తల్లిదండ్రులేనని దీప్తి చేసిన ఫిర్యాదు మేరకు 15 మందిపై కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనీష్, దీప్తి ఇద్దరు ఉన్నత చదువులు చదివి ఇద్దరు గ్రామపంచాయతీ అధికారులుగా ప్రభుత్వ కొలువులను సాధించారు. ఇద్దరూ ఒకే చోట పని చేయటం వల్ల వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్న వీరి జీవితంలో ఇలాంటి ఘటన ఎదురైందని దీప్తి కన్నీరుమున్నీరయ్యారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…