ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో దంపతులు కొందరు చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన అక్కడ కూడా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పూణెలోని అంబేగావ్ ఏరియాకు చెందిన గహినినాథ్ సరవడె (33)కి, ప్రతీక్ష (23) అనే మహిళకు 2019లో వివాహం అయింది. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు వస్తుండేవి. ఈ క్రమంలోనే తాజాగా అతను ఒక రోజు రాత్రి ఇంటికి భార్యకు చెప్పకుండా పానీ పూరీ పార్శిల్ తెచ్చాడు.
అయితే అప్పటికే వంట పూర్తి చేశానని, అదంతా ఎవరు తింటారని, అసలు తనకు చెప్పకుండా పానీ పూరీ ఎందుకు తెచ్చావని.. ప్రతీక్ష తన భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే మరుసటి రోజు ఉదయం ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో పోలీసులు గహినినాథ్ పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…