ఒక మనిషికి మృత్యువు ఏ వైపు నుంచి ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. బయటకు వెళ్ళిన మనిషి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడని నమ్మకం లేకుండాపోతోంది. మృత్యువుకు, వయస్సతో సంబంధం లేకుండా అందరినీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గత నెలరోజుల క్రితం తల్లి పోయిందన్న బాధలో కుటుంబమంతా తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి ఆ కుటుంబం తేరుకుంటోంది. అయితే ఆ కుటుంబంలోని ఓ యువకుడు డ్యూటీకి వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ కు గురయ్యాడు. తీవ్ర గాయాల పాలై దుర్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కందుకూరు మండలం రాచులూరు గ్రామానికి చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్ అనే యువకుడు అమెజాన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం డ్యూటీ నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తనకి మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకు వచ్చింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనాథ్ టిప్పర్ రావడం గమనించి దానిని తప్పించపోయాడు. అయితే ఆ టిప్పర్ వేగంగా అతనిపై నుంచి వెళ్లడంతో శ్రీనాథ్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషయం తెలిసిన తన తండ్రి, చెల్లి సంఘటన స్థలానికి చేరుకొని భోరున విలపించారు. మమ్మల్నిద్దర్నీ వదిలి అమ్మ దగ్గరికి వెళ్లి పోయావా అన్నయ్యా.. అంటూ ఆ చెల్లెలి రోదన పలువురికి కంటతడి పెట్టించింది. ఈ విషయం తెలిసిన అతని బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించి తనకు న్యాయం చేయాలని, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం పోయిందని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…