ఒక మనిషికి మృత్యువు ఏ వైపు నుంచి ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. బయటకు వెళ్ళిన మనిషి క్షేమంగా తిరిగి ఇంటికి వస్తాడని నమ్మకం లేకుండాపోతోంది. మృత్యువుకు, వయస్సతో సంబంధం లేకుండా అందరినీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గత నెలరోజుల క్రితం తల్లి పోయిందన్న బాధలో కుటుంబమంతా తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి ఆ కుటుంబం తేరుకుంటోంది. అయితే ఆ కుటుంబంలోని ఓ యువకుడు డ్యూటీకి వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ కు గురయ్యాడు. తీవ్ర గాయాల పాలై దుర్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
కందుకూరు మండలం రాచులూరు గ్రామానికి చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్ అనే యువకుడు అమెజాన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం డ్యూటీ నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తనకి మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకు వచ్చింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీనాథ్ టిప్పర్ రావడం గమనించి దానిని తప్పించపోయాడు. అయితే ఆ టిప్పర్ వేగంగా అతనిపై నుంచి వెళ్లడంతో శ్రీనాథ్ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషయం తెలిసిన తన తండ్రి, చెల్లి సంఘటన స్థలానికి చేరుకొని భోరున విలపించారు. మమ్మల్నిద్దర్నీ వదిలి అమ్మ దగ్గరికి వెళ్లి పోయావా అన్నయ్యా.. అంటూ ఆ చెల్లెలి రోదన పలువురికి కంటతడి పెట్టించింది. ఈ విషయం తెలిసిన అతని బంధువులు, స్నేహితులు రోడ్డుపై బైఠాయించి తనకు న్యాయం చేయాలని, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం పోయిందని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…