నవమాసాలు మోసి పేగుతెంచుకు పుట్టిన బిడ్డను ప్రతి తల్లి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఆ బిడ్డకు ఏ చిన్న సమస్య వచ్చినా ఆ తల్లి అల్లాడి పోతుంది. అలాంటిది బిడ్డను 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి, ఉన్నఫలంగా ఆ బిడ్డ అర్ధాంతరంగా కన్నుమూస్తే ఆ తల్లి కడుపుకోత వర్ణనాతీతం. తన కళ్ళ ఎదురుగానే తన కొడుకు జీవచ్చవంలా పడి ఉంటే ఏ తల్లీ జీర్ణించుకోలేదు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. తన కన్న కొడుకు కళ్లెదుట జీవచ్చవంలా పడి ఉండడాన్ని చూడలేక ఆ తల్లి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అందరినీ కలిచి వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరు నగరంలోని విజయనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనం కేసులో మోహన్ గౌడ అనే 20 ఏళ్ల యువకుడిను విచారణకి పోలీసులు పిలవడంతో మోహన్ గౌడ్ భయపడిపోయాడు. ఈక్రమంలోనే బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్న మోహన్ మంగళవారం పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. అయితే అతను ఇంటికి వచ్చిన సమయంలో తన తల్లి ఇంట్లో లేదు. తండ్రి ఏదో పనిలో నిమగ్నమై ఉన్నాడు.ఈ క్రమంలోనే లోపలికి వెళ్ళిన మోహన్ ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎంతసేపటికీ తన కొడుకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపు బద్దలుకొట్టి చూడగా తన కొడుకు ఉరి వేసుకుని కనిపించడంతో ఆస్పత్రికి తరలించాడు. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన తన తల్లికి ఇరుగుపొరుగువారు జరిగిన సంగతి చెప్పడంతో ఆగమేఘాలపై ఆ తల్లి ఆసుపత్రికి చేరుకుంది. అయితే అప్పటికే తన కుమారుడు మరణించాడన్న వార్తను ఆ తల్లి జీర్ణించుకోలేక పోయింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి ఆవరణలో బయటకు పరిగెత్తుతూ ఎదురుగా వస్తున్న వాహనం కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విధంగా ఒకే ఇంట్లో తల్లి, కొడుకు మరణించడంతో ఆ ఇంటి యజమాని కుప్పకూలిపోయాడు. కన్న కొడుకుపై ఉన్న ప్రేమతో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అందరినీ కలచి వేసింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…