సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సహజంగానే తమ అభిమానులకు రోజూ చాలా దగ్గరగా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించినవే కాకుండా, వ్యక్తిగత పనులకు చెందిన పోస్టులను కూడా పెడుతుంటారు. అందులో భాగంగానే నటి శృతి హాసన్ తాజాగా తన అభిమానులతో ముచ్చటించింది.
శృతి హాసన్ ఇటీవలే ప్రభాస్ మూవీ సాలర్ హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకుని ముంబైలోని తన ఇంటికి చేరుకుంది. తన తండ్రి కమలహాసన్, బాయ్ ఫ్రెండ్ శంతానుతో కలిసి సరదాగా గడుపుతోంది. ఈ క్రమంలోనే గురువారం ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా అభిమానుల ముందుకు వచ్చింది. ఆస్క్ మి ఎవ్రీథింగ్ పేరిట ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
అయితే ఒక ఫ్యాన్ ఆమెను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ ? అని అడగ్గా.. అందుకు శృతి హాసన్ బదులిస్తూ.. ఇప్పుడప్పుడే ఆ విషయం గురించి ఆలోచించడం లేదు, నేను పూర్తి నిజాయితీతో బదులిస్తున్నా, ఇది 2021, ప్రపంచ వ్యాప్తంగా అనేక కలవరపెట్టే సంఘటనలు జరుగుతున్నాయి, అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి, ప్రశాంతంగా ఉండండి.. అంటూ సమాధానం ఇచ్చింది.
ఇక శృతి హాసన్ నటించిన రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. రవితేజతో కలిసి క్రాక్ మూవీలో, పవన్ కల్యాణ్తో కలిసి వకీల్ సాబ్ లో ఆమె నటించగా, ఆ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఆమె విజయ్ సేతుపతితో కలిసి లాబం అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే ప్రభాస్తో కలిసి సాలర్ అనే చిత్రంలో నటిస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…