విధి అంటే అలాగే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనులే మనకు మృత్యువును తెచ్చి పెడతాయి. ఎప్పుడు ఎవరికి ఎలా ఏం జరుగుతుందో తెలియదు. రోజూ బస్సులో ఆఫీసుకు వెళ్లే ఆమె కరోనా కర్ఫ్యూ విధించారని సొంత వాహనంపై వెళ్లింది. రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలై చనిపోయింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లాకు చెందిన సంధ్య (23) అనే యువతి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తోంది. అయితే ఏపీలో కరోనా కారణంగా కర్ఫ్యూను విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నింటికీ అనుమతులు ఇచ్చారు. మధ్యాహ్నం 12 దాటితే ప్రజా రవాణా కూడా అందుబాటులో లేదు. కాగా రోజూ బస్సులో ఆఫీస్కు వెళ్లే సంధ్య కర్ఫ్యూ ఉందని, ఇంటికి రావడం కష్టమవుతుందని చెప్పి సొంత వాహనం స్కూటీపై వెళ్లింది.
కానీ మార్గమధ్యలో ఆమెను మృత్యువు బలిగొంది. దగదర్తి లైన్స్ నగర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనం ఆమె స్కూటీని ఢీకొంది. దీంతో ఆమె స్కూటీ నుంచి పక్కకు ఎగిరి పడింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అయితే కరోనా భయంతో ఎవరూ ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆమె కొంత సేపు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడి మృతి చెందింది. కాగా పోలీసులు ఆ వాహనం డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. రోజూలాగే తమ కుమార్తె బస్సులో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆమె తల్లిదండ్రులు శోక సంద్రమయ్యారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…