సాధారణంగా దొంగతనం చేసే వారు రాత్రిపూట జన సంచారం లేని ప్రదేశాలలో దొంగతనాలు చేస్తుంటారు. ఈ విధంగా రాత్రిపూట దొంగతనాలు చేసిన ఎంతోమంది దొంగలను పోలీసులు గుర్తించారు. కానీ ఈ దొంగ మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా ఉండడమే ఇతని ప్రత్యేకత. అందరూ దొంగలు రాత్రిపూట దొంగతనం చేస్తే ఇతను మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తుంటాడు.గత ఏడు సంవత్సరాలుగా ఆంధ్ర, తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం మేరకు…
తమిళనాడు రాష్ట్రం తిరప్పత్తూరు జిల్లా కరంభూరు గ్రామానికి చెందిన గోవిందరాజన్ కుమారుడు శక్తివేల్(33) అక్కడ టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నారు. ఎవ్వరికీ ఏమాత్రం అనుమానం రాకుండా దొంగతనాలు చేయటం ఇతని ప్రత్యేకత. ఎక్కువ జనాభా లేని గ్రామాలను ఎంపిక చేసుకొని ఉదయం అందరూ పొలం పనులకు వెళ్లగానే ఇతను కారులో వెళ్లి ఆ ఇంటి తలుపు పై లేదా చుట్టుపక్కల తాళాన్ని వెతికి సులభంగా ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారు నగలను దొంగతనం చేస్తుంటాడు.
ఏడు సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్న ఇతని పై ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలలో కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి.పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఈ దొంగ దాదాపు 250 గ్రాముల బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. ఈ విధంగా ఉదయం పూట మాత్రమే జరుగుతున్న దొంగతనాలు పై నిఘా పెట్టిన ఐడీ పార్టీ ఈ చోరీలకు పాల్పడుతున్నది శక్తివేల్గా గుర్తించి, చివరికి బైరెడ్డిపల్లి వద్ద అతనిని అదుపులోకి తీసుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…