సాధారణంగా దొంగతనం చేసే వారు రాత్రిపూట జన సంచారం లేని ప్రదేశాలలో దొంగతనాలు చేస్తుంటారు. ఈ విధంగా రాత్రిపూట దొంగతనాలు చేసిన ఎంతోమంది దొంగలను పోలీసులు గుర్తించారు. కానీ ఈ దొంగ మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా ఉండడమే ఇతని ప్రత్యేకత. అందరూ దొంగలు రాత్రిపూట దొంగతనం చేస్తే ఇతను మాత్రం పట్టపగలు దొంగతనాలు చేస్తుంటాడు.గత ఏడు సంవత్సరాలుగా ఆంధ్ర, తమిళనాడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం మేరకు…
తమిళనాడు రాష్ట్రం తిరప్పత్తూరు జిల్లా కరంభూరు గ్రామానికి చెందిన గోవిందరాజన్ కుమారుడు శక్తివేల్(33) అక్కడ టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నారు. ఎవ్వరికీ ఏమాత్రం అనుమానం రాకుండా దొంగతనాలు చేయటం ఇతని ప్రత్యేకత. ఎక్కువ జనాభా లేని గ్రామాలను ఎంపిక చేసుకొని ఉదయం అందరూ పొలం పనులకు వెళ్లగానే ఇతను కారులో వెళ్లి ఆ ఇంటి తలుపు పై లేదా చుట్టుపక్కల తాళాన్ని వెతికి సులభంగా ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారు నగలను దొంగతనం చేస్తుంటాడు.
ఏడు సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్న ఇతని పై ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలలో కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి.పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఈ దొంగ దాదాపు 250 గ్రాముల బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. ఈ విధంగా ఉదయం పూట మాత్రమే జరుగుతున్న దొంగతనాలు పై నిఘా పెట్టిన ఐడీ పార్టీ ఈ చోరీలకు పాల్పడుతున్నది శక్తివేల్గా గుర్తించి, చివరికి బైరెడ్డిపల్లి వద్ద అతనిని అదుపులోకి తీసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…