కరోనా వల్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ గతేడాది ఆలస్యంగా జరిగింది. అయితే ఈసారి మాత్రం అనుకున్న తేదీలకే మన దేశంలోనే నిర్వహిస్తున్నారు. ఇంకొన్ని గంటల్లోనే ఐపీఎల్ 14వ ఎడిషన్ ప్రారంభం కానుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్లను హాట్ స్టార్ తన యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుందనే సంగతి తెలిసిందే. కానీ ఆ యాప్కు సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. అయితే ఎలాంటి ఫీజు చెల్లించకుండానే ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్లను చూడవచ్చు. అదెలాగంటే…
జియో, ఎయిర్టెల్, వి, జియో ఫైబర్, జియో పోస్ట్ పెయిడ్ ప్లస్, టాటా స్కై, ఫ్లిప్కార్ట్ కస్టమర్లు ఐపీఎల్ మ్యాచ్లను ఉచితంగానే వీక్షించవచ్చు. అందుకు గాను వారికి ఉచితంగా హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దాన్ని పొందేందుకు వారు ఆయా కంపెనీలు నిర్దేశించిన విధంగా ప్లాన్లను రీచార్జి చేసుకోవాలి. పోస్ట్పెయిడ్ అయితే అధిక విలువ కలిగిన ప్లాన్ను తీసుకోవాలి. దీంతో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
హాట్స్టార్లో రెండు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీఐపీ ప్లాన్ అయితే రూ.399కు లభిస్తుంది. కానీ ఆయా టెలికాం సంస్థలకు చెందిన పలు ప్రీపెయిడ్ ప్లాన్లతో హాట్స్టార్ వీఐపీ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. ఇక పోస్ట్పెయిడ్ అయితే ఎంపిక చేసిన ప్లాన్లతో హాట్ స్టార్ వీఐపీ ప్లాన్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్కార్ట్ కస్టమర్లు తమకు ఆ అకౌంట్లో ఉన్న సూపర్ కాయిన్లను ఉపయోగించి హాట్ స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ను కొనుగోలు చేయవచ్చు. దీంతో హాట్స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఐపీఎల్ మ్యాచ్లను ఉచితంగా వీక్షించవచ్చు.
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్…
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…