ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు, అనుమానాలు తలెత్తి అవి ఎన్నో వివాదాలకు కారణమవుతున్నాయి. మరికొన్నిసార్లు ఆత్మహత్యకు, హత్యలకు కూడా దారితీస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. కేవలం తన భర్త మల్లెపూలు తేవడం లేదని అతన్ని భార్య చంపిన ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
రాజస్థాన్ లోని బలపురాలో దేవీసింగ్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి పశువుల దాణా వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య పింకీతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీన తెల్లవారుజామున ఎవరో తలుపు తట్టడంతో దేవీ సింగ్ నిద్రమత్తులోనే వెళ్లి తలుపు తీయగా ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాప్ ధరించి ఒక్కసారిగా దేవీసింగ్ పై దాడి చేసి అక్కడికక్కడే చంపివేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం చేరవేశారు.
అసలు దేవీసింగ్ ను ఇంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటని పోలీసులు ఆరాతీయగా అతనికి శత్రువులు కూడా ఎవరూ లేరని తెలియడంతో పోలీసుల అనుమానం అతని భార్యపై పడింది. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
తన భర్త మొదట్లో ప్రతి రోజూ తనకు మల్లెపూలు తీసుకువచ్చి ఎంతో ప్రేమగా చూసుకునే వాడని, ఈ మధ్యకాలంలో తనకు మల్లెపూలు తేవడంలేదని, పైగా ఇంటికి ఎప్పుడో వస్తున్నాడని తనపై ప్రేమ కూడా తగ్గిందని తెలిపింది. ఈ క్రమంలోనే అతను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో తన భర్తని నిలదీయగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి చివరికి హత్య చేసే వరకు వచ్చిందని, తానే ముగ్గురు రౌడీలకు సుపారీ ఇచ్చి ప్లాన్ ప్రకారం తన భర్తను చంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తన భర్తకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా లేదా అనే విషయం మాత్రం తెలియడం లేదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…