ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు, అనుమానాలు తలెత్తి అవి ఎన్నో వివాదాలకు కారణమవుతున్నాయి. మరికొన్నిసార్లు ఆత్మహత్యకు, హత్యలకు కూడా దారితీస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. కేవలం తన భర్త మల్లెపూలు తేవడం లేదని అతన్ని భార్య చంపిన ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
రాజస్థాన్ లోని బలపురాలో దేవీసింగ్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి పశువుల దాణా వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య పింకీతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీన తెల్లవారుజామున ఎవరో తలుపు తట్టడంతో దేవీ సింగ్ నిద్రమత్తులోనే వెళ్లి తలుపు తీయగా ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాప్ ధరించి ఒక్కసారిగా దేవీసింగ్ పై దాడి చేసి అక్కడికక్కడే చంపివేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం చేరవేశారు.
అసలు దేవీసింగ్ ను ఇంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటని పోలీసులు ఆరాతీయగా అతనికి శత్రువులు కూడా ఎవరూ లేరని తెలియడంతో పోలీసుల అనుమానం అతని భార్యపై పడింది. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
తన భర్త మొదట్లో ప్రతి రోజూ తనకు మల్లెపూలు తీసుకువచ్చి ఎంతో ప్రేమగా చూసుకునే వాడని, ఈ మధ్యకాలంలో తనకు మల్లెపూలు తేవడంలేదని, పైగా ఇంటికి ఎప్పుడో వస్తున్నాడని తనపై ప్రేమ కూడా తగ్గిందని తెలిపింది. ఈ క్రమంలోనే అతను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో తన భర్తని నిలదీయగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి చివరికి హత్య చేసే వరకు వచ్చిందని, తానే ముగ్గురు రౌడీలకు సుపారీ ఇచ్చి ప్లాన్ ప్రకారం తన భర్తను చంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తన భర్తకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా లేదా అనే విషయం మాత్రం తెలియడం లేదు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…