క్రైమ్‌

దారుణం.. మల్లెపూలు తేలేదని భర్తను చంపిన భార్య..!

ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు, అనుమానాలు తలెత్తి అవి ఎన్నో వివాదాలకు కారణమవుతున్నాయి. మరికొన్నిసార్లు ఆత్మహత్యకు, హత్యలకు కూడా దారితీస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. కేవలం తన భర్త మల్లెపూలు తేవడం లేదని అతన్ని భార్య చంపిన ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

రాజస్థాన్ లోని బలపురాలో దేవీసింగ్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాల నుంచి పశువుల దాణా వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య పింకీతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 22వ తేదీన తెల్లవారుజామున ఎవరో తలుపు తట్టడంతో దేవీ సింగ్ నిద్రమత్తులోనే వెళ్లి తలుపు తీయగా ముగ్గురు వ్యక్తులు మంకీ క్యాప్ ధరించి ఒక్కసారిగా దేవీసింగ్ పై దాడి చేసి అక్కడికక్కడే చంపివేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం చేరవేశారు.

అసలు దేవీసింగ్ ను ఇంత దారుణంగా చంపడానికి గల కారణం ఏంటని పోలీసులు ఆరాతీయగా అతనికి శత్రువులు కూడా ఎవరూ లేరని తెలియడంతో పోలీసుల అనుమానం అతని భార్యపై పడింది. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.

తన భర్త మొదట్లో ప్రతి రోజూ తనకు మల్లెపూలు తీసుకువచ్చి ఎంతో ప్రేమగా చూసుకునే వాడని, ఈ మధ్యకాలంలో తనకు మల్లెపూలు తేవడంలేదని, పైగా ఇంటికి ఎప్పుడో వస్తున్నాడని తనపై ప్రేమ కూడా తగ్గిందని తెలిపింది. ఈ క్రమంలోనే అతను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో తన భర్తని నిలదీయగా వారిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగి చివరికి హత్య చేసే వరకు వచ్చిందని, తానే ముగ్గురు రౌడీలకు సుపారీ ఇచ్చి ప్లాన్ ప్రకారం తన భర్తను చంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తన భర్తకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా లేదా అనే విషయం మాత్రం తెలియడం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వివో నుంచి మరో పవర్ ఫుల్ ఫోన్.. భారత్‌లో Vivo X200T లాంచ్.. ఫీచర్లు, ధర చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…

Tuesday, 27 January 2026, 9:25 PM

ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…

Tuesday, 27 January 2026, 7:39 PM

మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!

70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…

Tuesday, 27 January 2026, 5:49 PM

పది పాసైతే చాలు.. ఆర్‌బీఐలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలు.. అప్లై చేయడానికి లింక్ ఇదే!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…

Tuesday, 27 January 2026, 2:59 PM

లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…

Tuesday, 27 January 2026, 9:45 AM

మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…

Monday, 26 January 2026, 9:44 PM

అమెజాన్ ఉద్యోగులకు షాక్.. రేపటి నుంచి 16 వేల మంది తొలగింపు? భారత్‌పైనే ఆ ప్రభావం ఎక్కువ!

అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…

Monday, 26 January 2026, 7:45 PM

తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే.. 2028లో జాగృతి పార్టీ విజయం ఖాయం: కవిత సంచలన వ్యాఖ్యలు

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…

Monday, 26 January 2026, 5:34 PM