శ్రీరెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సోషల్ మీడియా వేదికగా ఏ విషయం గురించి మాట్లాడినా అది పెద్ద సంచలనంగా మారిపోతుంది. ఎలాంటి విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తనకు నచ్చినది నచ్చినట్టుగా మాట్లాడటం వల్ల ఈమె చేసే వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు కారణమవుతుంటాయి. ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ఎందరినో టార్గెట్ చేస్తూ వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
మూడో టెస్టులో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఈ ఘోర పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు క్రికెట్ అభిమానులు కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లీ అసమర్థత కారణంగానే టీం ఇండియా ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది అంటూ కామెంట్లు చేయగా ఈ లిస్టులో శ్రీరెడ్డి కూడా చేరిపోయింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
కేవలం కోహ్లీ అసమర్థత కారణంగానే టీమిండియా ఓడిపోయిందని, అసలు తనకు బ్యాటింగ్ చేయడం రాదని, అతను టీమిండియా కెప్టెన్ గా పనికిరాడని ముందుగా అతనిని తొలగించి రోహిత్ శర్మ ను కెప్టెన్ గా చేయాలని కోహ్లీపై విరుచుకుపడింది. ఈ క్రమంలోని శ్రీరెడ్డి కోహ్లీపై చేసిన వ్యాఖ్యలకు కోహ్లీ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారికి కూడా దీటైన సమాధానం తెలియజేసింది. ఇకపోతే రోహిత్ శర్మ అభిమానులు మాత్రం శ్రీ రెడ్డి వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్ గా నియమించాలని కోరుతున్నారు. ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు శ్రీరెడ్డి సినిమాలు, రాజకీయాలు వదిలిపెట్టి ఇప్పుడు క్రికెట్ రంగంపై పడిందంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీ రెడ్డి విరాట్ కోహ్లీపై చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ ట్వీట్ను ఆమె తరువాత డిలీట్ చేసింది.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…