శ్రీరెడ్డి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సోషల్ మీడియా వేదికగా ఏ విషయం గురించి మాట్లాడినా అది పెద్ద సంచలనంగా మారిపోతుంది. ఎలాంటి విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తనకు నచ్చినది నచ్చినట్టుగా మాట్లాడటం వల్ల ఈమె చేసే వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు కారణమవుతుంటాయి. ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ఎందరినో టార్గెట్ చేస్తూ వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
మూడో టెస్టులో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఈ ఘోర పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు క్రికెట్ అభిమానులు కేవలం కెప్టెన్ విరాట్ కోహ్లీ అసమర్థత కారణంగానే టీం ఇండియా ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది అంటూ కామెంట్లు చేయగా ఈ లిస్టులో శ్రీరెడ్డి కూడా చేరిపోయింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కోహ్లీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
కేవలం కోహ్లీ అసమర్థత కారణంగానే టీమిండియా ఓడిపోయిందని, అసలు తనకు బ్యాటింగ్ చేయడం రాదని, అతను టీమిండియా కెప్టెన్ గా పనికిరాడని ముందుగా అతనిని తొలగించి రోహిత్ శర్మ ను కెప్టెన్ గా చేయాలని కోహ్లీపై విరుచుకుపడింది. ఈ క్రమంలోని శ్రీరెడ్డి కోహ్లీపై చేసిన వ్యాఖ్యలకు కోహ్లీ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయగా వారికి కూడా దీటైన సమాధానం తెలియజేసింది. ఇకపోతే రోహిత్ శర్మ అభిమానులు మాత్రం శ్రీ రెడ్డి వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్ గా నియమించాలని కోరుతున్నారు. ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు శ్రీరెడ్డి సినిమాలు, రాజకీయాలు వదిలిపెట్టి ఇప్పుడు క్రికెట్ రంగంపై పడిందంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీ రెడ్డి విరాట్ కోహ్లీపై చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ ట్వీట్ను ఆమె తరువాత డిలీట్ చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…